బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ కి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. ప్రస్తుతం వచ్చిన సాహో సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. మరి అలాంటి స్టార్ తో సినిమా చేయడానికి ఏ దర్శకుడైనా ముందుకు వస్తాడు. ప్రభాస్ తో సినిమా చేయాలనుకునే వాళ్లలో పూరిజగన్నాథ్ కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన "జనగణమన" సినిమాని ప్రభాస్ తో తెరకెక్కించాలని అనుకుంటున్నాడట.


పూరి జగన్నాథ్ ప్రభాస్ తో ఇదివరకు బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లాంటి సినిమాలు చేశాడు. కానీ ఆ రెండు సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు. దీంతో ఎప్పటికైనా తనకిష్టమైన ప్రభాస్ తో గ్రాండ్ హిట్ కొట్టాలన్నదే తన కొరికని పలు సందర్భాల్లో అన్నారు పూరి. ప్రభాస్ సైతం పూరి అంటే చాలా అభిమానిస్తూ ఉంటాడు. బుజ్జిగాడు సినిమా కోసం ఆరు నెలలు వెయిట్ చేశానని ఒకానొక సందర్భంలో ప్రభాస్ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రభాస్ పూరితో చేసిన రెండు సినిమాల్లో చాలా డిఫరెంట్ గా కనిపించాడు.


పూరి ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మళ్ళీ సక్సెస్ బాట పట్టాడు. చాలా రోజుల తర్వాత పూరికి మంచి విజయం లభించింది. మాస్ మసాలా సినిమాలను తీయడంలో దిట్ట అయిన పూరి జగన్నాథ్ ప్రభాస్ తో సినిమా తీస్తే ఆయన అభిమానులకు పండగే. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ప్రభాస్ ప్రస్తుతం రాధాక్రిష్ణ దర్శకత్వంలో "జాన్" అనే సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావాలంటే చాలా టైం వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: