కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ -  ఇళయ దళపతి విజయ్ కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న మూడవ చిత్రం 'బిగిల్'.  స్పోర్ట్స్ డ్రామా గా  రానున్న ఈ చిత్రంఫై సౌత్ లో భారీ అంచనాలు వున్నాయి. ఇటీవలే   షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.  గత ఏడాది  విజయ్ నటించిన సర్కార్  తమిళం తోపాటు తెలుగులోనూ  మంచి వసూళ్లను రాబట్టి  విజయం సాధించింది. దాంతో విజయ్ కి తెలుగులో మార్కెట్ పెరిగింది. సర్కార్  తెలుగులో 7.5 కోట్లకు అమ్మగా .. బిగిల్ ను 9కోట్లకు అమ్మారు.  యంగ్ ప్రొడ్యూసర్  మహేష్ ఎస్ కోనేరు ఈ చిత్రం హక్కులను సొంతం చేసుకున్నాడు.   అలాగే విజయ్ కెరీర్ లోనే ఈచిత్రం ఏపీ&తెలంగాణలో  ఏకంగా 400స్క్రీన్ లలో  విడుదలకానుంది. 



ఇక తెలుగులో  రజినీకాంత్, సూర్య లకు మంచి మార్కెట్ ఉండగా ఇప్పుడు విజయ్ ,బిగిల్ తో  ఆ జాబితాలో చేరాడు.   కాగా  ఈ చిత్రం లో విజయ్  డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.  భారీ బడ్జెట్ తో  ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈచిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా ఏ ఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్నాడు.  ఈచిత్రం  దీపావళికి  కానుకగా విడుదలకానుంది.



ఇదిలా ఉంటే కోలీవుడ్ లో విజయ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో   తొలి రోజు ఈ చిత్రం అక్కడ  భారీ రికార్డులను   సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.  ఒకవేళ హిట్ టాక్ వస్తే  మాత్రం బిగిల్ , 2.0 రికార్డులను కూడా బ్రేక్ చేసే అవకాశాలు  లేకపోలేదు.ఇక ఈ చిత్రం యొక్క  ఆడియో వేడుకను  సెప్టెంబర్ 19న భారీగా నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: