మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమాగా 270 కోట్ల భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం పై మెగా పవర్ స్టార్ రాం చరణ్  నిర్మించిన సినిమా సైరా నరసింహారెడ్డి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్న, నిహారిక తదితరులు నటించిన ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. ఇక ఈ మెగా సినిమా ఓవర్ సీస్ డీల్ లాక్ అయింది. గడిచిన రెండు మూడు రోజులుగా దీని మీద రకరకాలు వార్తలు వచ్చాయి. ఓవర్ సీస్ డీల్ 18 కోట్లు అంటూ గాసిప్ లు వినిపించాయి. కానీ 15 కోట్లకే ఈ డీల్ క్లోజయిందన్నది అసలు వాస్తవమని తాజా సమాచారం. 

సాహో సినిమాను చేసిన ఫారస్ సంస్థనే సైరా విదేశీ పంపిణీ హక్కులు తీసుకుంది. ఒక విధంగా ఇది ఇద్దరికి మంచి బేరమే అనుకోవాలి. ఇటీవల ఓవర్ సీస్ మార్కెట్ బాగా పడిపోయింది. మహర్షి లాంటి సూపర్ హిట్ సినిమానే అనుకున్న రేంజ్ కు చేరడం కష్టం అయింది. ఇక రీసెంట్‌గా వచ్చిన సాహో సినిమా సగానికి సగం నష్టాలు మిగిల్చింది. 
ఇలాంటి టైమ్ లో 15 కోట్లు రావడం అంటే మంచి డీల్ సెట్ అయిందని చెప్పుకుంటున్నారు. ఇక బయ్యర్ సైడ్ నుంచి చూసుకుంటే అమెరికా మార్కెట్ లో మెగాస్టార్ కు వున్న క్రేజ్, సినిమాకు వున్న బజ్ అన్నీ కలిసి 10 కోట్లకు పైగా వస్తుందని ఆశిస్తున్నారు. అందువల్ల ఇరువర్గాలకు ఇది మంచి డీల్ అని తెలుస్తోంది.
ఇదిలావుంటే అమెరికాలో ఫారస్ సంస్థనే పంపిణీ చేస్తుందా? లేక అక్కడ తెలుగు సినిమాల పంపిణీ లో అనుభవం వున్న సంస్థ ద్వారా చేస్తుందా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. గ్రేట్ ఇండియా, బ్లూ స్కై, వీకెండ్ సినిమా సంస్థలు ఈ డీల్ కోసం ప్రయత్నిస్తున్నాయి. వీకెండ్ సినిమా మంచి క్యాష్ ఆఫర్ తో ముందుకు వస్తే, బ్లూ స్కై, గ్రేట్ ఇండియా తమ తమ సర్కిళ్ల ద్వారా యుఎస్ డీల్ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో పక్కా క్లారిటి త్వరలో రానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుండగా మెగా ఫ్యాన్స్ ఈ డేట్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: