టాలీవుడ్ బాలీవుడ్ లలో బయోపిక్ ల హవా కొనసాగుతున్న తరుణంలో మన పక్కా హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటించే అవకాశం బాలీవుడ్ హీరోయిన్, సాహోతో తెలుగు తెరకు పరిచయమైన శ్రద్ధ కపూర్ ని వరించిన సంగతి తెలిసిందే. సాహో కంటే ముందే సైనా కి సంతకం చేసింది. ఏడాది పాటు షటిల్ బ్యాట్.. రాకెట్ పట్టుకుని ప్రిపరేషన్ కూడా సాగించింది. కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్టు నుంచి శ్రద్ధాని తప్పించి పరిణీతిని ఎంపిక చేసుకున్నారని వార్తలొచ్చాయి. శ్రద్ధా సరిగా కో-ఆపరేట్ చేయకపోవడం వల్లనే దర్శకుడు అమోల్ గుప్తా శ్రద్ధాని తొలగించారని చెప్పుకున్నారు. అయితే దీనిపై శ్రద్ధా స్వయంగా క్లారిటి ఇచ్చింది. 

ఒకేసారి రెండు పెద్ద సినిమాలకు కాల్షీట్లు కేటాయించడం అంటే కుదిరే పనేనా? ఆ రెండింట్లో ఏదో ఒకటే ఎంపిక చేసుకోవాల్సి వస్తే ఏం చేయాలి?  పైగా తనకు ఎంతో నేర్పించిన గురువు(రెమో)ఇచ్చిన ఆఫర్ వదులుకోవాలా? పైగా అది సీక్వెల్ సినిమా. దానిని కాదనుకుంటే అన్యాయం చేసినట్టే. ఒకవేళ అవును అనుకుంటే.. ఇంకో సినిమా వదులుకోవాల్సిందే! అంటూ స్పష్టంగా చెప్పింది శ్రద్ధా కపూర్. శ్రద్ధా గురువు రెమో డి.సౌజా తెరకెక్కిస్తున్న స్ట్రీట్ డ్యాన్సర్ 3డి కోసం సైనా బయోపిక్ ని వదులుకోవాల్సి వచ్చింది. అయితే తనకోసం ఆ బయోపిక్ దర్శకుడిని వెయిట్ చేయించడం ఇష్టం లేకే నో చెప్పానని చెప్పింది.

దీంతో శ్రద్ధా ఫ్యాన్స్ కు సైనా మీద పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. ఇక రీసెంట్‌గా చిచ్చోరే సినిమాతో సక్సస్ అందుకున్న శ్రద్ధా సాహో తో మరో బ్లాక్ బస్టర్ (హిందీలో) ని ఖాతాలో వేసుకుంది. ఆ వెంటనే తన ఫేవరెట్ మూవీ స్ట్రీట్ డ్యాన్సర్ 3డి తో బిజీ అయ్యింది. ఈ సినిమా 2020 జనవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వరుణ్ ధావన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక శ్రద్దా తెలుగులో కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. బాలీవుడ్ హీరోయిన్ లా అనిపించకుండా ప్రభాస్ సరసన సరిగ్గా సూటవడమే కాకుండా మన టాలీవుడ్ హీరోలకు సరిపోయో మరో గ్లామరస్ హీరోయిన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్రాండ్   ఎంట్రి ఇచ్చింది. మరి ఈ బాలీవుడ్ బ్యూటి తెలుగులో ఏ స్టార్ హీరో పక్కన ఛాన్స్ అందుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: