మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'సైరా' సినిమా ప్రతిరోజు ఒక అప్డేట్ తో వారిని కనువిందు చేస్తోంది. ఇప్పుడు ఆ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో 18వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ఆడియో రిలీజ్ అనే పేరు విని చాలా రోజులైంది కదా. దీని తర్వాత ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఉంటుందో లేదో అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే భారీ ఎత్తున మొదలు పెట్టేసారు. మెగా అభిమానులకు ఈ వార్తతో పాటు మరో తీయటి కబురు కూడా ఉంది.

భారీ స్థాయిలో నిర్వహించనున్న ఈ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నది ఎవరో కాదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, జనసేన పార్టీ అధ్యక్షుడు అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇది కదా చొక్కాలు చింపుకొని అప్డేట్ అంటే. మొన్ననే అన్నదమ్ములు ఇద్దరినీ సైరా టైలర్ డబ్బింగ్ రూమ్ లో చూసిన అభిమానులకు ఈ సారి ఏకంగా స్టేజి పైనే ఫుల్ మీల్స్ రెడీ చేశారు నిర్మాతలు. చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుతాడు… పవన్ చిరు పైన ఆప్యాయతని ఎలా చాటుకుంటాడు అని కేవలం మెగా అభిమానులే కాకుండా సినీ ప్రేక్షకులంతా వేయి కళ్లతో ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, భారత దేశంలో మరుగున పడిపోయిన చరిత్రలో మరపురాని స్వాతంత్ర వీరుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి వంటి ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: