ఇక ఇప్పుడు మళ్ళీ పూజా హెగ్డే ఈ సినిమా చేయడానికి ఒప్పుకుందని సమాచారం వస్తుంది. ప్రస్తుతం పూజా, రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రంలో నటిస్తుంది. అయితే సాహో ఫలితం తో ప్రభాస్ ఈసినిమా కు బ్రేక్ ఇచ్చాడు. దాంతో మళ్ళీ ఈసినిమా షూటింగ్ నవంబర్ లో ప్రారంభంకానుంది. ఈలోగా డేట్స్ ను అడ్జెస్ట్ చేసుకొని అఖిల్ తో సినిమా చేయడానికి పూజా హెగ్డేఒప్పుకుందట. అయితే ఈవిషయం లో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి వుంది.
బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 పతాకం ఫై బన్నీ వాసు , వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధం లో ఈచిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసిన అఖిల్ కు ఈ సినిమా విజయం కీలకం కానుంది. మరి ఈ సినిమా తోనైనా అఖిల్ హిట్ కొట్టి కెరీర్ లో మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.