బిగ్ బాస్ సీజన్ 3 8వ వారం ఎప్పటిలానే గొడవలతో సాగుతుంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులతో విసిగిపోతున్న కంటెస్టంట్స్ ఇన్నాళ్లు కేవలం తోటి కంటెస్టంట్స్ మీదనే గొడవ పడేవారు కాని ఈ వారం పునర్నవి, మహేష్ లు ఏకంగా బిగ్ బాస్ మీద కూడా గొడవకు దిగుతున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోకుండా పునర్నవి ప్రవర్తన ఉండటం విశేషం.


ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్ లో తనని ఇంటి సభ్యులు చాలా రఫ్ గా హ్యాండిల్ చేశారని పునర్నవి బిగ్ బాస్ మీద ఫైర్ అయ్యింది. అలాంటివి జరిగినప్పుడు ఎందుకు మాట్లాడరని బిగ్ బాస్ పై కోప్పడ్డది. ఇక ఈ టాస్క్ లో వరస్ట్ పర్ఫార్మర్స్ గా శ్రీముఖి, పునర్నవి, మహేష్ లు నిలిచారు. ఈ వరస్ట్ పర్ఫార్మెన్స్ ను కూడా బిగ్ బాస్ సెలెక్ట్ చేయడం విశేషం.


అయితే వారికి పనిష్మెంట్ గా బూట్లు పాలిష్ చేయాలని చెప్పాడు బిగ్ బాస్. టాస్క్ లో తను ఏం తప్పు చేయలేదని.. అందుకే తను వరస్ట్ పర్ఫార్మర్ కాదని.. బిగ్ బాస్ ఇచ్చిన ఈ పనిష్మెంట్ తాను చేసేది లేదని పునర్నవి భీష్మించుకు కూర్చుంది. బిగ్ బాస్ రెండు మూడు సార్లు ఆదేశించినా సరే పునర్నవి మాత్రం అది చేయలేదు.


పనిష్మెంట్ చెప్పగానే శ్రీముఖి తాను చేసేందుకు సిద్ధమైంది. అయితే మహేష్ కూడా ముందు నిరాకరించినా ఇంటి సభ్యులు చెప్పడంతో బూట్లు పాలిష్ చేసేందుకు ఓకే అన్నాడు. అయితే పునర్నవి మాత్రం అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. బిగ్ బాస్ ఆదేశాలను పాటించకపోతే నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్ ఉంటుందని చెప్పినా సరే పునర్నవి పనిష్మెంట్ గా ఇచ్చిన టాస్క్ చేయలేదు. పునర్నవి ప్రవర్తనపై ఇంటి సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత మంకు పట్టు పటాల్సిన అవసరం లేదని.. టాస్క్ లో ఇచ్చిన ఈ పనిష్మెంట్ గురించి ఆమె ఇంత సీన్ ఎందుకు చేస్తుందో అని గుసగుసలాడుతున్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: