ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధ  ఆధారంగా తెరకెక్కిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కర్నూలు ఈనెల 15 ఫ్రీ రిలీజ్ వేడుక నిర్వహించాలని చిత్రయూనిట్ నిర్ణయించింది. కర్నూల్ లో ప్రీ రిలీజ్ వేడుక  నిర్వహించడం ద్వారా తెలుగు లో  చిత్ర ప్రమోషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావించింది .  అయితే కర్నూల్ లో నిర్వహించదల్చిన  ఫ్రీ రిలీజ్ వేడుక వాయిదా పడినట్లు తెలుస్తోంది.  సైరా ప్రీ రిలీజ్ వేడుక ను ఇప్పుడు  హైదరాబాద్ లో నిర్వహించాలని చిత్ర యూనిట్  నిర్ణయించినట్లు సమాచారం.


ఈ  నెల 18 వ తేదీన  గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఫ్రీ రిలీజ్ వేడుక నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు  ఫిలింనగర్ వర్గాల టాక్. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహణపై  చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి , నయనతార , బిగ్ బి అమితాబ్ బచ్చన్ , జగపతి బాబు , కిచ్చ సుదీప్ , విజయ్ సేతుపతి , తమన్నా లు నటిస్తోన్న,   సైరా చిత్రంపై భారీ అంచనాలే ఉన్నప్పటికీ,  సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను,  చిత్ర యూనిట్ ఇప్పటివరకు పెద్ద గా కార్యక్రమాలు చేపట్టింది లేదు . బాలీవుడ్ లో సినీ ప్రమోషన్ లో భాగంగా  ముంబైలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది . తెలుగు తో పాటు ఇతర భాషల్లోను  సినీ  ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్ట లేదు. 


భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై తెలుగునాట భారీ అంచనాలే ఉన్నప్పటికీ, దానికి తగినట్లుగా  ప్రమోషన్ చేపట్టాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు . అక్టోబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా హిందీ తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు దర్శకుడు సురేందర్రెడ్డి నిర్మాత రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: