టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి కెరటం సినిమాతో అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ తోలి సినిమాతో పర్వాలేదనిపించినా, ఆ తరువాత వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా హిట్ తో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది. అనంతరం గోపీచంద్ హీరోగా నటించిన లౌక్యంతో మరొక సూపర్ హిట్ కొట్టిన రకుల్, ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ సంపాదించింది. ఇక అక్కడినుండి మంచి విజయాలు అందుకున్న రకుల్, ఇటీవల కొన్నాళ్లుగా సరైన విజయం లేక కెరీర్ పరంగా తీవ్రంగా సతమతం అవుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. 2017లో నాగచైతన్య సరసన ఆమె నటించిన రారండోయి వేడుక చూద్దాం సినిమా తరువాత తెలుగులో ఇప్పటివరకు రకుల్ కు సరైన సక్సెస్ లేదు. 

ఇక ఇటీవల ఆమె ఎన్నో అంచనాలు పెట్టుకున్న మన్మధుడు 2 సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో రకుల్ పరిస్థితి మరింత ఇబ్బందుల్లో పడింది. మరోవైపు తమిళ్ లో కూడా ఆమె ఇటీవల నటించిన దేవ్, ఎన్జీకే సినిమాలు బోల్తాకొట్టడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆమెకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు, అయితే తమిళ్ లో మాత్రం కమల్, శంకర్ ల భారతీయుడు 2లో, అలానే శివకార్తికేయన్ సినిమాల్లోనూనూ ఆమెను అవకాశాలు వరించాయి. ఎన్టీఆర్ సరసన నాన్నకు ప్రేమతో, చరణ్ తో ధ్రువ, అల్లు అర్జున్ తో సరైనోడు వంటి సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న రకుల్, 

ప్రస్తుతం కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటుండడంతో, ఆమె ఫ్యాన్స్ ఎంతో ఫీల్ అవుతూ, త్వరలోనే ఆమెకు టాలీవుడ్ లో మంచి విజయం దక్కాలని కోరుకుంటూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి గడ్డు పరిస్థితులు తప్పవని, కాబట్టి అటువంటి సమయంలో అధైర్య పడకుండా, వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని విజయం కోసం ముందుకు సాగితే విజయం తప్పక వరిస్తుందని, కనుక ఆ విధంగా రకుల్ ప్రస్తుత పరిస్థితులు ఎప్పుడూ అలానే ఉండవని, రాబోయే రోజుల్లో ఆమె తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటారని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: