మహేష్ బాబు సినిమా మహర్షి సూపర్ హిట్ అయింది. ఆసినిమాలో హీరోయిన్ గా నటించిన పూజాహెగ్డేకి  ఈ సినిమా బాగా ప్లస్ అయ్యింది అని చెప్పాలి. ఈ సినిమాలో పూజ నటనకి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. దీనితో  ఇప్పుడు ఆమెకు వరుస  అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం ఆమె నాని  సరసన రెండో సినిమా చేస్తుంది.మరో రెండు ప్రాజెక్టులు కూడా ఆమె చేస్తుంది. ఇకపోతే ఈమె గురించి ఒక వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది. అదేమిటి అంటే .. సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో సారి నటిస్తుందట. 

వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరూ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ అధికారిగా నటిస్తున్నాడు. అలాగే ఈ సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందాన నటిస్తుంది.  ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ అదిరిపోవడంతో పటు మహేష్ కూడా ఆర్మీ డ్రెస్ లో సూపర్బ్ అనిపిస్తుండటం తో సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ తరుణంలో మరో వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. మహర్షి సినిమాలో మహేష్ సరసన నటించిన ముద్దుగుమ్మ మరోసారి మహేష్  సరసన   సరిలేరు నీకెవ్వరూ సినిమాలో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలో రష్మికతో పాటుగా ఈమె కూడా మహేష్ తో సరసాలు ఆడుతుందని మాటలు వినిపిస్తున్నాయి.

దీనికి ప్రధాన కారణం ఆమెకి ఉన్న ట్రాక్ రికార్డ్స్ కారణం అని చెప్పవచ్చు. ఆమె మెగాపవర్ స్టార్ నటించిన రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన విషయం తెలిసిందే. జిగేలు రాణి అంటూ ఆమె వేసిన స్టెప్స్ కి యువతలో మంచి ఫాలోయింగ్ వచ్చింది. అలాగే ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో బిగెస్ట్ హిట్ గా నిలవడంతో ఆమెకి వెంటనే మహేష్ సరసన మహర్షి సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా మహేష్ కెరియర్ లో 25 వ సినిమా కావడం తో చాలా ప్రెస్టీజియస్ గా తీసుకోని తెరకెక్కించారు. ఈ సినిమా మహేష్ కెరియర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. దీనితో పూజా ఉంటె హిట్ గ్యారెంటీ అనే మాట వినిపిస్తుండటం తో మహేష్ తాజా చిత్రం లో కూడా  ఒక స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే కనిపించనుంది  అని సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: