టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో మంచి జోరుమీద ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. భరత్ అనే నేను మహర్షి సినిమా లతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నిర్మాతలకు కాసుల వర్షం కురిపించి రికార్డులు సృష్టించిన మహేష్ బాబు హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయిపోయాడు. ఈ క్రమంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ తో పాటు హీరోయిన్ గా రష్మిక మందన మొట్టమొదటిసారి నటిస్తోంది. దిల్ రాజు రామ్ సుంకర కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే వరుసగా మూడోసారి మహేష్ బాబు సినిమాకు సంగీతమందిస్తున్నాడు దేవిశ్రీప్రసాద్.


అయితే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి దాదాపు 13 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. ఇటువంటి నేపథ్యంలో విజయశాంతి తన సినిమాలో నటించడంతో మహేష్ బాబు సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేసి సంచలనం సృష్టించారు. విషయమేమిటంటే విజయశాంతి కృష్ణ సినిమా తో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయితే రీ ఎంట్రీ లో మహేష్ బాబు సినిమాతో అడుగుపెట్టడంతో...వెండితెరపై విజయశాంతి ఎటువంటి పాత్ర చేస్తుందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.


ఇటువంటి నేపథ్యంలో కొడుకు దిద్దిన కాపురం చిత్రం సెట్స్ లో అప్పట్లో విజయశాంతి తో కలసి మహేష్ బాబు బాలనటుడిగా ఉన్న సమయంలో ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కామెంట్ రూపంలో మహేష్ బాబు...1989లో కొడుకు దిద్దిన కాపురంలో విజయశాంతిగారితో కలసి నటించా. కాలం చాలా వేగంగా మారిపోయింది. మళ్లీ 30 ఏళ్ల తర్వాత ఆమెతో కలసి నటిస్తున్నా అని మహేష్ పేర్కొన్నాడు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: