సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తూ బిగ్ బాస్ షో చాలా ఇంట్రస్టింగ్ గా సాగుతుంది. కొన్ని కోపాలు.. మరికొన్ని నవ్వులు.. అలకలు.. అరుపులు..గొడవలు అలాగే మరో వైపు టాస్కులు వారానికి ఓ ఎలిమినేషన్ తో బిగ్ బాస్ షో ఆసక్తిగా ముందుకుపోతుంది. ఎన్నో ట్విస్టులు.. మరెన్నో ఫైట్స్తో బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకొని... ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం శిల్పా చక్రవర్తి, పునర్నవి భూపాలం, హిమజ, మహేష్ విట్టా, శ్రీముఖిలు ఈ వారం ఎలిమినేషన్స్లో ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఈ సీజన్లో కంటెస్టెంట్లకు ఓ సెంటిమెంట్ బలంగా వెంటాడుతోందని చెప్పాలి. అదే ఫస్ట్ నామినేషన్ ఫర్ ఎలిమినేషన్.. ఎలిమినేషన్ ప్రాసెస్లో మొదటిసారి నామినేట్ అయిన వారందరూ హౌస్ నుంచి బయటికి రావడం ఒక ఆనవాయితీగా మారింది.
మొదట హౌస్లోకి వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి.. ఫస్ట్ టైం ఎలిమినేషన్స్కు నామినేట్ అయ్యి , బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చేసింది. ఆ తర్వాత రోహిణి, అషు రెడ్డిలు కూడా మొదటసారే నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయ్యారు. ఇక రీసెంట్గా అలీ రెజా కూడా ఫస్ట్ టైం అయ్యి.. హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం జరిగింది. తమన్నా సింహాద్రి అంటే రవికృష్ణకు చుక్కలు చూపించడం.. దుర్భషలాడటం జరిగింది కాబట్టి ప్రేక్షకులకు నచ్చక ఎలిమినేట్ చేశారు. మరి రోహిణి, అలీ రెజాలు హౌస్లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయినా ఎలిమినేట్ కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక ఈ వారానికి సంబంధించిన ఎలిమినేషన్స్ లో ఉన్న శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరికి తెలిసిందే. ఆమెకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెని కాపాడుతుంది. ఇక హిమజ కి హౌస్లోకి వచ్చిన తరువాత ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అలాగే పునర్నవి , మహేష్ కి కూడా ఫ్యాన్స్ ఉండటంతో ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన శిల్ప ఎలిమినేషన్ ఖాయంగా కనిపిస్తుంది. దీనికి తోడు ఈ వారం ఎలిమినేషన్లో ఉన్న యాంకర్ శిల్పా చక్రవర్తి కూడా హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. చూడాలి మరి ఈ ఫస్ట్ నామినేషన్ కంటెస్టెంట్లకు శాపంగా మారిందా లేదా అనేది.