ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాలతో అలానే మంచి సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ, గోల్డెన్ లెగ్ అని పేరు సంపాదించిన నటి పూజ హెగ్డే. ఈ అమ్మడుకి ప్రస్తుతం టాలీవుడ్ లో విపరీతమైన డిమాండ్ మరియు క్రేజ్ ఉంది. ఇటీవల ఎన్టీఆర్ తో అరవింద సమేత, అలానే సూపర్ స్టార్ మహేష్ తో భరత్ అనే నేను వంటి సూపర్ డూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం బన్నీతో కలసి అల వైకుంఠపురములో అలానే ప్రభాస్ తో కలిసి జాన్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ప్రస్తుతానికి తనకు కాల్ షీట్స్ లేని కారణంగా కొత్త సినిమాలు ఇప్పట్లో ఒప్పుకోకూడదని నిర్ణయించిందట. 

నిజానికి ఇటీవల అఖిల్, బొమ్మరిలు భాస్కర్ సినిమా ప్రారంభ సమయంలో ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని భావించారట ఆ సినిమా యూనిట్. అయితే ఆమెకు డేట్స్ లేని కారణంగా మరొక హీరోయిన్ వేటలో పడ్డారట దర్శక నిర్మాతలు. కానీ వారికి ఏమనిపించిందో ఏమో, తమ సినిమాలో పూజనే హీరోయిన్ గా తీసుకోవాలని నిర్ణయించి, చివరకు నేడు ఆమెను కలవడం జరిగిందట. ఇక ఆ సినిమా కథ విన్న తరువాత, ఫైనల్ గా ఎలాగో అడ్జస్ట్ చేసి తన కాల్షీట్స్ ఆ సినిమా కోసం కేటాయించిందట పూజ. మరి కెరీర్ పరంగా నటించిన మూడు సినిమాలతో సరైన సక్సెస్ లేని అఖిల్ కు, 

గోల్డెన్ లెగ్ గా పేరుగాంచిన పూజ హెగ్డే, అతడికి ఏ మాత్రం సక్సెస్ ని అందిస్తుందో చూడాలి అంటూ పలు విధాలుగా ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మంచి ఎంటర్టైనర్ గా సాగనున్న ఈ సినిమాలో అఖిల్ మంచి రొమాంటిక్ స్టయిల్ తో పాటు మాస్ స్టయిల్ లో కూడా దర్శనమివ్వనున్నట్లు సమాచారం. అఖిల్ తో పాటు, కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేని బొమ్మరిల్లు భాస్కర్, ఎంతో పట్టుదలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా, ఎంతమేరకు వారిద్దరికి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: