బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ నిజ స్వరూపాలు మెల్ల మెల్లగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా పునర్నవి అసలు రంగు బయటపడింది. నామినేషన్స్ రోజు శివజ్యోతి పునర్నవిని నామినేట్ చేస్తూ, నువ్వు నామినేషన్స్ ని స్పోర్టివ్ గా తీసుకోవు అని కారణం చెప్తుంది.  గడిచిన మూడు రోజుల్లో పునర్నవిని గమనిస్తే శివజ్యోతి చెప్పింది నిజమే అనిపిస్తుంది. నామినేషన్స్ అయిన రోజు నుండి ఇప్పటి వరకు పునర్నవి ఒకరకమైన చిరాకుతో, ఫస్ట్రేషన్ తో ఉంది. టాస్క్ లో కూడా ఆ చిరాకును ప్రదర్శించింది.


బిగ్ బాస్ ని ఎదిరించి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అయితే  ఇదంతా ఆమె ప్లాన్ ప్రకారమే కావాలనే  చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నామినేషన్స్ లో పునర్నవి  తన మీద ఫోకస్ తెచ్చుకుని, స్క్రీన్ ప్రెసెన్స్ కోసమే ఇంత రచ్చ చేసినట్టుగా భావిస్తున్నారు. టాస్క్ చేయనని చెప్పి, మళ్లీ వరుణ్ ఏదో చెప్పగానే వచ్చి టాస్క్ పూర్తి చేస్తుంది. చేయకూడదని ఫిక్స్ అయినపుడు మొత్తానికే చేయకూడదు కదా! అదీగాక బిగ్ బాస్ కి సారీ చెప్తుంది.


ఇదంతా చూస్తుంటే పునర్నవి వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం తనకు జరిగిన దానికి ఓవర్ గా రియాక్ట్ అయ్యి నాటకీయతను జోడించి ప్రేక్షకుల దృష్టిలో పడదామనే ఇదంతా చేసిందనే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కొసమెరుపేంటంటే, బిగ్ బాస్ నియమాలు పాటింట్లేదని రోహిణిని, హౌస్ లో ప్రాపర్టీ డ్యామేజ్ చేసిందని శ్రీముఖిని డైరెక్ట్ గా నామినేట్ చేసిన బిగ్ బాస్ పునర్నవి బండబూతులు తిట్టినా, ఊరికే ఇంగ్లీషులో మాట్లాడిన సైలెంట్ గా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.


మరి బిగ్ బాస్ అలా ఉండడానికి కారణాలు ఏంటో తెలియదు. పునర్నవి ప్రవర్తన ఇలాగే ఉంటే ఈవారం గట్టెక్కే ఛాన్స్ ఉన్నప్పటికీ, ముందు ముందు ప్రమాదంలో పడే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: