తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ఐభై రోజులు దాటిపోయింది.  ఇంటి సభ్యులకు ఇక కామెడీ చాలు ఆట, పోటీ గట్టిగా ఉండాలని బిగ్ బాస్ హెచ్చరించారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ నుంచి నటి హేమ, జాఫర్, తమన్నా,రోహిణి, అర్షు వెళ్లగా పోయిన ఆదివారం ఎవ్వరూ ఊహించని విధంగా అలీ రజా ఇంటి నుంచి వెళ్లడం అందరినీ ఆర్చర్యపరిచింది.  వాస్తవానికి ఆరు వారాల పాటు అలీ ఎప్పుడూ ఎలిమినేట్ కాలేదు.  వైల్డ్ కార్డు ఎంట్రీతో యాంకర్ శిల్పా చక్రవర్తి ఎంట్రీ ఇవ్వగానే అలీని టార్గెట్ చేసుకోవడం..అలీ మొదటి సారిగా ఎలిమినేషన్ రౌండ్ లోకి రావడం..వెంటనే ఎలిమినేట్ కావడం అంతా గమ్మత్తుగా జరిగిపోయింది. 

ఇక అలీ ఇంటి నుంచి వెళ్లిపోతుంటే అందరూ కన్నీరు పెట్టుకున్నారు. మొన్న జరిగిన ఇంట్లో దెయ్యం..నాకేం భయ్యం టాస్క్ గోల గోలగా జరిగింది.  అయితే ఇందులో చెత్త పర్ఫామెన్స్ చేసిన పునర్నవి, శ్రీముఖి,మహేష్ లకు షూ క్లిన్ చేసే పనిష్ మెంట్ పడింది. దాంతో మహేష్, పునర్నవి ఈ పనిష్మెంట్ పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తాము గతిలేక బిగ్ బాస్ లోకి రాలేదని, ఇలాంటి చెత్త పనిష్మెంట్ ఎవరూ చేయరని పునర్నవి మొండికేసింది.  ఇక మహేష్ ని శివజ్యోతి బుజ్జగించడంతో షూ క్లీన్ చేశాడు. నిన్న వరుణ్ సందేష్ , పునర్నవిని బుజ్జగించడంతో ఆమె కూడా ఈ పనిష్మెంట్ పూర్తి చేసింది. 

ఇక కెప్టెన్సీ టాస్క్ లో వితిక, శ్రీముఖి, మహష్ లు పోటీ పడగా వారిని భుజంపో మోసుకు వెళ్తూ జెండాలు ఒక చోట పెట్టాల్సిన టాస్క్ లో వరుణ్ తన భార్య అయిన వితికను భుజంపై మోసుకుంటూ వెళ్లి ఆ టాస్క్ ని పూర్తి చేశాడు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్ గా వితిక నియమించబడింది.  బిగ్ బాస్ 3 లో తాను కెప్టెన్ కావాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్న వితిక కల నెరవేరడంతో ఇంట్లో నానా హంగామా చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: