టాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్లేస్‌పై జెండా పాతేసిన సమంతను టార్గెట్ చేసింది.  వివాహం జరిగిన తరువాత సమంత కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ హీరోయిన్ గా కాకుండా సరికొత్త కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. 'యూటర్న్' సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ తాజాగా దర్శకురాలు నందిని రెడ్డితో క‌లిసి ఓ బేబి చేసి మంచి విజ‌యాన్ని సాధించింది. కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను రూపొందించారు. 

ఆ త‌ర్వాత సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్న '96' తెలుగు రీమేక్ తాజా షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 16 నుంచి జరుగుతుంది. ఈ షెడ్యూల్ తో  షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. తమిళ్‌ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘96’ చిత్రంలో సమంత, శర్వానంద్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంట్రస్టింగ్ టైటిల్‌ ప్రచారంలోకి వచ్చింది. త‌మిళ వ‌ర్షెన్‌ని తెర‌కెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు వ‌ర్షెన్‌ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి జాను లేదా జానకి దేవి అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. శ‌ర్వానంద్ చిత్రంలో కెమెరామెన్‌గా క‌నిపించ‌నున్నాడు. అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్ తొలి వారంలో చిత్ర షూటింగ్ పూర్తి కానుంద‌ని అంటున్నారు. అయితే ఈ చిత్రం త‌ర్వాత స‌మంత ప‌లు ప్రాజెక్టుల‌లో న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తుండ‌గా, అవన్నీ అవాస్త‌వాలు అంటున్నారు. 96 రీమేక్ త‌ర్వాత కొద్ది రోజుల పాటు స‌మంత సినిమాల‌కి బ్రేక్ తీసుకొని మాతృత్వం పొందేందుకు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటుంద‌ని స‌మాచారం.

సమంత దూకుడును ప్రదర్శిస్తోంది. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకు పచ్చ జెండా ఊపేస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటోంది. ఆమె నటించిన 'ఓ బేబీ' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోయింది. ఈ క్రమంలోనే కలెక్షన్లనూ భారీగానే సాధించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: