ఏడాది వయసులోనే 'సిసింద్రీ' సినిమాతో మెప్పించిన అఖిల్.. హీరోగా మాత్రం ఇప్పటి వరకు ఒక్క హిట్‌ను కొట్టలేకపోయాడు. ఈయన నటించిన మూడు సినిమాలు నిరాశ పరిచాయి. ఆకట్టుకునే అందం.. ఫిజిక్.. నటన ఉన్నా.. కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అఖిల్ చేసిన మూడు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇక ఇప్పుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ సినిమాతో రాబోతున్నాడు అఖిల్. తొలి సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఆ స్థాయి విజయం అందుకోలేదు భాస్కర్. దాంతో అఖిల్ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు ఈయన.


ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్ నిర్మిస్తుండటంతో నమ్మకం కూడా బాగానే ఉంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే కన్ఫర్మ్ అయింది. చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించినా కూడా చివరికి పూజాను ఫైనల్ చేసారు దర్శక నిర్మాతలు. కొన్ని కారణాల వల్ల రష్మిక మందన్నతో పాటు ఇంకొందరు హీరోయిన్లు ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఈ సినిమా కోసం 1.25 కోట్ల పారితోషికం అందుకుంటుంది పూజా హెగ్డే. నిజానికి ఇది చాలా పెద్ద అమౌంట్. అఖిల్ సరసన పూజా హెగ్డే నటించడమే విచిత్రం అనుకుంటే.. ఈ జోడీని భాస్కర్ స్క్రీన్‌పై ఎలా చూపిస్తాడనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదివరకే సవ్యసాచిలో నాగచైతన్యతో జోడీ కట్టిన నిధి అగర్వాల్‌తో మిస్టర్ మజ్ను చేసాడు అఖిల్. ఇకిప్పుడు ఒక లైలా కోసం హీరోయిన్ పూజాతో రొమాన్స్ చేస్తున్నాడు అఖిల్ అక్కినేని. మరి ఈమె అయినా అఖిల్ కోరుకుంటున్న విజయం తీసుకొస్తుందో లేదో చూడాలి. చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించినా కూడా చివరికి పూజాను ఫైనల్ చేసారు దర్శక నిర్మాతలు. కొన్ని కారణాల వల్ల రష్మిక మందన్నతో పాటు ఇంకొందరు హీరోయిన్లు ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: