టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తండ్రి  నటశేఖర కృష్ణ గారివలె స్క్రీన్ పై అద్భుతమైన నటనను ప్రదర్శించడంతో పాటు ఆయన మాదిరి ఎంత అందగాడో అందరికీ తెలిసిందే. తెలుగులోనే కాదు కోలీవుడ్, మోలీవుడ్, బాలీవుడ్ వంటి పలు ఇతర భాషల్లోను ఆయన అందం మరియు నటనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయన ప్రక్కన హీరోయిన్ గా ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని ఎదురుచూసే హీరోయిన్లు ఎందరో ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఇటీవల తన కెరీర్ 25వ సినిమాగా వచ్చిన మహర్షితో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మహేష్, 

ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక అందరు హీరోల మాదిరి ఎక్కువగా షూటింగ్స్ తో బిజీ బిజీ గా ఉండే మహేష్ బాబు, మధ్యలో తన ఫ్యామిలీతో కలిసి విహార యాత్రలకు వెళ్తుంటారు. అయితే ఆయనను కొన్నాళ్ల నుండి ఒక వ్యాధి వెంటాడుతోందని షాకింగ్ గా నేడు తన యూట్యూబ్ లో ఛానల్ ద్వారా తెలిపారు మహేష్. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఎక్కువగా తీరికలేకుండా షూటింగ్స్ లో గడిపే నాకు ఇటీవల మైగ్రేన్ తలనొప్పి రావడం మొదలైందని, ఆ నొప్పి వచ్చినపుడు ఎంతో బాధ పేడేవాడిని, ఇక దాని నుండి రిలీఫ్ కోసం కొన్నిరకాల పెయిన్ కిల్లర్స్ కూడా వాడడం జరిగిందని అన్నారు. 

అయితే కొందరు సన్నిహితుల సలహాతో చక్రసిద్ద నాడి వైద్య నిపుణులు శ్రీమతి సత్య సింధూజ గారి గురించి తెలుసుకుని ఆవిడను కలవడం జరిగిందని, అనంతరం తన సమస్య ఆవిడకు వివరించి, వారి వద్ద చికిత్స తీసుకున్న తరువాత ప్రస్తుతం ఆ వ్యాధి పూర్తిగా నయమైందని తన వీడియోలో తెలిపారు మహేష్. అయితే తనకు వ్యాధి నయం అవడంతో పాటు మానసికంగా ఎంతో ఆనందాన్నిచ్చిన చక్రసిద్ద నాడి వైద్యం గురించి,  తన వంతుగా మాట్లాడుదాం అని, సత్య సింధూజ గారితో కలిసి ఈ వీడియో చేయడం జరిగిందని మహేష్ తెలిపారు. సుమ కనకాల వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: