పవన్ కళ్యాణ్ కు కథ చెప్పి ఒప్పించాలి అంటే చాల కష్టమైన పని. ఒక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ తప్ప మరెవ్వరూ అంత సులువుగా పవన్ కు కథ చెప్పి ఒప్పించిన సందర్భాలు లేవు. అయితే టాప్ హీరోలకు కథలు చెపుతూ వారి అంగీకారం కోసం ఎదురు చూసి రోజులు వృథా చేసుకునే అలవాటులేని అర్జున్ రెడ్డి క్రియేటర్ సందీప్ వంగా ఇప్పుడు పవన్ అపాయింట్ మెంట్ ఎదురు చూడటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సంచలన దర్శకుడు దగ్గర ఒక పవర్ ఫుల్ స్టోరీ ఉన్నట్లు టాక్. ఈ కథ అన్ని విధాల పవన్ ఇమేజ్ కి సరిపోతుంది అని అతడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ విషయాలు తెలుసుకున్న మైత్రీ మూవీ సంస్థ ఏదో విధంగా సందీప్ రెడ్డిని పవన్ కాంపౌండ్ లోకి తీసుకు వెళ్లి అతడి చేత ఆ పవర్ ఫుల్ కథను వినిపించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 

ఈ విషయంలో మైత్రీ మూవీస్ సంస్థకు అత్యంత సన్నిహితుడైన రామ్ చరణ్ ద్వారా కూడ పవన్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి పవన్ ఈ ఏడాది చివరిలోగా ఎదో ఒక సినిమాలో నటించాలి అని ఆలోచనలు చేస్తున్నా ‘అర్జున్ రెడ్డి’ లాంటి సంచలన సినిమాను తీసిన సందీప్ తన స్థాయికి తగ్గ కథను ఇవ్వగలడా అన్న సందేహాలు పవన్ ను వెంటాడుతున్న నేపధ్యంలో పవన్ సందీప్ రెడ్డిని కలవడానికి అంతగా ఆసక్తి కనపరచడం లేదు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. 

అయితే పవన్ అభిమానులు మాత్రం ఈ వార్త నిజమైతే బాగుండును అని అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్ మూవీ ‘పింక్’ రీమేక్ లో నటించే కంటే పవన్ ఇలాంటి క్రేజీ డైరెక్టర్ మూవీలో నటిస్తే ఆ మూవీ ప్రాజక్టుకు విపరీతమైన క్రేజ్ వస్తుదని అభిప్రాయ పడుతున్నారు. అయితే పవన్ నిర్ణయాలు ఆలోచనలు పసికట్టడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి ఈ విషయంలో పవన్ ఎటువంటు నిర్ణయాలు తీసుకుంటాడు అన్న ఆసక్తి బాగా కనిపిస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: