సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సామాజిక పనులు చేస్తూ తనవంతుగా సమాజానికి ఏదో రూపంలో ఉపయోగపడుతూనే ఉంటారు. యాడ్స్ రంగంలోనూ అలాగే వ్యాపార రంగంలోనూ తనదైన శైలిలో రాణిస్తున్న మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకని హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబు తన హెల్త్ కండిషన్ గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టాడు.


ఒకానొక సమయంలో అప్పట్లో తనకు మైగ్రేన్ సమస్య ఉండేదని దాని నుండి ఆ వ్యాధి నుండి బయటపడటానికి చాలామంది డాక్టర్స్ ని కలిసినట్లు చెప్పుకొచ్చాడు. అయినా కానీ వ్యాధి తగ్గకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని కానీ చివరాఖరికి భార్య నమ్రత స్నేహితురాలి ద్వారా సత్య సింధూజ అనే డాక్టర్ ని కలిసినట్లు చెప్పారు. ఆమెకి చక్రసిద్ద నాడీ వైద్యం గురించి తెలుసని.. ఆమె తనకు అందించిన చికిత్స ఏంటో తెలియదు కానీ నాలుగైదు సార్లు ట్రీట్మెంట్ తీసుకున్న తరువాత మైగ్రేన్ పూర్తిగా తగ్గిపోయిందని.. ఇప్పుడున్న టాబ్లెట్లు కేవలం నొప్పిని తాత్కాలికంగా నివారిస్తాయని.. అది సరైన పద్ధతి కాదని చెప్పారు.


నేను కూడా అప్పట్లో నొప్పిని తట్టుకోలేక చాలా పెయిన్ కిల్లర్ తీసుకునే వాడిని అని మహేష్ చెప్పుకొచ్చారు. కానీ సత్య సింధూజ అందించిన వైద్యంతో టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం రాలేదని.. ఎలాంటి టాబ్లెట్లు తీసుకోకుండా ఇతర చికిత్సల ద్వారా అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చనేది తను నమ్మే సిద్ధాంతమని చెప్పారు. ఇటువంటి వ్యాధితో బాధపడుతున్న వారు ఈ విధంగా తమ ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చు అని మహేష్ తెలిపాడు. ఈ సందర్భంగా చక్రసిద్ద నాడీ వైద్యం గురించి అందరూ తెలుసుకోవాలి అని మహేష్ సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: