టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు మొదట విలన్ వేషాలు వేసి తర్వాత టాప్ హీరోలుగా మారిన సందర్భాలు ఉన్నాయి. తెలుగులో మెగాస్టార్, శ్రీకాంత్, గోపిచంద్ ఇలా విలన్ గా నటించి తమ సత్తా చాటి తర్వా హీరోగా మంచి ఫామ్ లోకి వచ్చారు. ఇక తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా మొదట విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా అజయ్ భూపతి దర్శకత్వంలో ‘ఆర్ ఎక్స్ 100’ మూవీతో హీరోగా కార్తికేయ పరిచయం అయ్యాడు. ఈ మూవీతోనే హీరోయిన్ గా పాయల్ రాజ్ పూత్ పరిచయం అయ్యింది.
మొదట ఈ మూవీ బోల్డ్ కంటెంట్ ఉందని తెగ ప్రచారం అయ్యింది..ట్రైలర్ చూసి చాలా మంది విమర్శించారు. ఈ మూవీలో ముద్దులు, అర్థనగ్నంగా ఉన్న సన్నివేశాలు ఉన్నాయని మహిళా సంఘాల నుంచి వ్యతిరేకత కూడా వచ్చింది. మొత్తానికి ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యింది..మొదటి వారం తర్వాత సినిమా హిట్ టాక్ వచ్చింది. ఇక ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ భారీగా కలెక్షన్ల వర్షం కురిసింది. పెట్టిన పెట్టుడికి పదింతల లాభం వచ్చింది. ఈ మూవీలో హీరోగా నటించిన కార్తికేయకు మంచి పేరు రావడంతో వరుసగా సినిమా ఛాన్సులు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ‘గుణ 369’ సినిమాలో నటించాడు..ఈ మూవీ పెద్దగా హిట్ కాలేదు. తాజాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీలో కార్తికేయ విలన్ గా నటించాడు. మొదటి నుంచి కార్తికేయ కాస్త టెంపర్ ఉన్న పాత్రల్లోనే నటించాడు..దాంతో ఇతడు ప్రతినాయకుడి పాత్రలకు అయితే బాగుంటుందని చాలా మంది భావించారు. ఇదే ఆలోచన విక్రమ్ కుమార్ కి రావడం..‘గ్యాంగ్ లీడర్’ లో ప్రతినాయకుడి పాత్ర ఇవ్వడం జరిగిందట. ఐదుగురు మహిళలు రివేంజ్ తీర్చుకునేందుకు హీరో నాని తమ గ్యాంగ్ లీడర్ గా ఎంచుకోవడం..ఇదే క్రమంలో నాని, కార్తికేయకు మద్య వచ్చే సీన్లు చాలా అద్భుతంగా ఆకర్షించాయి. మొత్తానికి కార్తికేయ విలన్ గా బాగా మెప్పించారని సినిమా వీక్షించిన పబ్లిక్ ఒపీనియన్ చెబుతున్నారు.