ఒక సినిమాలో కలిసి నటించిన హీరోయిన్స్ మళ్ళీ ఇంకో సినిమాలో కూడా కలిసి నటించే అవకాశాలు చాలా తక్కువ. కాని ఇస్మార్ట్ హీరోయిన్స్ కి అలాంటి ఛాన్స్ వచ్చిందని లేటెస్ట్ న్యూస్. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన సినిమా ఇస్మార్ట్ శంకర్. రామ్ ని ఇంతవరకు ఏ డైరెక్టర్ చూపించని విధంగా పూరి ఊర మాస్ హీరోగా చూపించి రామ్ ఇమేజ్ ని ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేశాడు. నిజంగా రామ్ లో ఇంత స్టఫ్ ఉందా అని ఇండస్ట్రీ మొత్తం షాకేయ్యోలా పూరి రామ్ ని ప్రజెంట్ చేశాడు. గత కొంతకాలంగా సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తూ ఫ్లాపుల్లో కూరుకుపోయిన రామ్ ని ఒకే ఒక్క సినిమాతో లాగి ఒడ్డున పడేశాడు. దాంతో రామ్ ఇప్పుడు ఏ సినిమాని చేయాలి...? ఎలాంటి కథను సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ పూరి రామ్ కాంబినేషన్ లోనే డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ తో సినిమా కి ప్లాన్ జరుగుతుందనుకున్నారు అందరు. కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండదని కన్‌ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే పూరి తన నెక్స్ట్ సినిమా విజయ్ తో కమిటయ్యాడు.

ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్ కూడా పూరి పుణ్యమా అంటూ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చి ఒళ్ళో పడుతున్నాయని ఫ్రెష్ అప్‌డేట్. పూరి హీరోయిన్స్ అంటే కనీసం ఓ 5 ఏళ్ళు ఇండస్ట్రీలో వెలగాల్సిందే. ఇప్పుడు ఇస్మార్ట్ లో నటించిన నిధీ అగర్వాల్, నభా నటేష్ ఇద్ధరు కూడా ఫుల్ బిజీ అవుతున్నారట. అందులో భాగంగానే మరో సారి ఈ ఇద్దరు కలిసి మెగా కాంపౌండ్ లో ఎంటరవడమే కాకుండా మెగా హీరో నటించే సినిమాలో మరో సారి ఇద్దరు నటిస్తున్నారన్నది తాజా సమాచారం.  

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'ప్రతిరోజూ పండగే' సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్‌ తేజ్‌ మరో సినిమాను లైన్‌లో పెట్టాడు. సుబ్బు అనే కొత్త దర్శకుడితో కలిసి సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నభా హీరోయిన్‌గా నటించనున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు ఇదే సినిమాలో మరో ఇస్మార్ట్ హీరోయిన్ నిధీ అగర్వాల్ కూడా నటిస్తుందని తాజా సమాచారం. ఇదేగనక నిజమైతే ఈ ఇద్దరి కెరీర్ కు ఇప్పట్లో బ్రేకులు వేసే వాళ్ళెవరు ఉండరు. రేంజ్ మారిపోతుంది.  
ఇక అక్కినేని నట వారసుడు అఖిల్‌ నటిస్తున్న తాజా చిత్రంలోనూ హీరోయిన్‌గా నభా పేరునే పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ నభా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కోరాజా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: