టాలీవుడ్ ఇండస్ట్రీలో 'అర్జున్ రెడ్డి'  సినిమా తో అదిరిపోయే హిట్ అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ వంగ. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరో అయిపోయాడు. ఈ ఒక్క సినిమా బ్రేక్ తో విజయ్ దేవరకొండ కి వరుస అవకాశాలు వచ్చాయి. అంతేకాకుండా సౌత్ లోనే తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. అయితే అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ మాత్రం తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో కాక బాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగులో చేసి అర్జున్ రెడ్డి సినిమా ని కబీర్ సింగ్ గా టైటిల్ పెట్టి రీమేక్ చేసి షాహిద్ కపూర్ నీ అద్భుతంగా చూపించాడు.


బాలీవుడ్ ఇండస్ట్రీలో సందర్భంగా మొట్టమొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వచ్చి సినిమా చేస్తారని అందరూ భావించిన క్రమంలో సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమై పోయాడు. గతంలో అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో డైరెక్టర్ సందీప్ వంగ సినిమా చేస్తారని అందరూ భావించారు. కానీ సందీప్ రెడ్డి వంగా మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో 'కబీర్ సింగ్' సినిమా చేయడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ వెంటనే బాలీవుడ్ లోనే మరొక సినిమా చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. అయితే ఈ సినిమాని 'కబీర్ సింగ్' నిర్మాతలు నిర్మించడానికి రెడీ అయినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వినపడుతున్న టాక్.


అంతేకాకుండా 'కబీర్ సింగ్' సినిమా హీరో షాహీద్ కపూర్ తోనే మళ్లీ సందీప్ రెడ్డి వంగా పని చేయబోతున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే సందీప్ షాహిద్ కపూర్ కి తీయబోయే సినిమా కి సంబంధించిన స్టోరీ లైన్ వినిపించాడట, కథ నచ్చడంతో అతను మరోసారి సందీప్ తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వీలైనంత త్వరగా ఈ కాంబినేషన్ పై స్పెషల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వినపడుతున్న టాక్. 



మరింత సమాచారం తెలుసుకోండి: