కన్నడ సినిమా కెజిఎఫ్, కేవలం ఆ భాషలోనే కాక దేశవ్యాప్తంగా పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయి రూ. 250 కోట్లకు పైగా భారీ స్థాయిలో కలెక్షన్ ని కొల్లగొట్టిన విషయం తెలిసిందే. కోలార్ గనుల నేపథ్యంలో కన్నడ స్టార్ యాష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని మాస్ మరియు యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని చెప్పవచ్చు. ఆ విధంగా ఆకట్టుకునే స్టైల్ లో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కు ప్రేక్షకుల నుండి విశేషమైన ప్రశంశలు లభించాయి. ఇక ప్రస్తుతం అదే సినిమాకు చాప్టర్ 2 ను తెరేకేక్కిస్తున్న నీల్, అతి త్వరలో టాలీవుడ్ స్టార్ హీరో ఒకరితో సినిమాను తెరకెక్కించనున్నటు వార్తలు కొద్దిరోజుల నుండి విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. 

నిజానికి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారితో ప్రశాంత్ ఒక సినిమా చేయాల్సి ఉంది, అయితే ఆ సినిమాను ఎన్టీఆర్ తో తీయనున్నట్లు అప్పట్లో వార్తలు రావడం జరిగింది. ఇక నాలుగు రోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబును ప్రత్యేకంగా కలిసిన ప్రశాంత్ నీల్, ఆయనకు ఒక అద్భుతమైన స్టోరీ లైన్ ని వినిపించారని, ఆ స్టోరీ మహేష్ కు విపరీతంగా నచ్చడంతో, దాని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసిన వెంటనే సినిమాను పట్టాలెక్కిద్దాం అని ప్రశాంత్ కు మాటిచ్చారట మహేష్. అయితే దీనిపై కూడా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతం ప్రచారం అవుతున్న దాన్ని బట్టి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రశాంత్ తెరకెక్కించబోయే సినిమా ఉంటుంది కానీ, ఈ ఇద్దరిలో ఏ హీరోతో ఉంటుంది అనే దానిపై మాత్రం స్పష్టత లేదు. ఇక ఈ విషయమై నేడు ఒక అప్డేటెడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వార్తను బట్టి, నెక్స్ట్ ప్రశాంత్ సినిమా చేసేది పక్కాగా మహేష్ తోనే అంటున్నారు. ఎలాగంటే, 

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొంటున్న మహేష్, డిసెంబర్ నెలాఖరుతో ఫ్రీ అవుతారని, అలానే ప్రశాంత్ కూడా తన కెజిఎఫ్ చాప్టర్ 2 ని మార్చి కల్లా పూర్తి చేసి, ఏప్రిల్ నెలాఖరులో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. అయితే దానిని బట్టి, ఈ మధ్యలోనే మహేష్ తో చేయబోయే సినిమా కథను పూర్తిగా సిద్ధం చేసి, ఫిబ్రవరి తరువాత ఒక మంచి ముహూర్తాన దానిని ప్రారంభిస్తారని, అందువలనే మహేష్ తన తదుపరి సినిమాను ఇంకా హోల్డ్ లోనే పెట్టారని అంటున్నారు. ఇక మరోవైపు ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, మే నెల తరువాత గాని, పూర్తి స్థాయిలో ఫ్రీ అవ్వరట, ఆ తరువాతనే ఆయన కొత్త సినిమా విషయమై ఆలోచిస్తారని తెలుస్తోంది. సో, దీనిని బట్టి ప్రశాంత్ నెక్స్ట్ చేయబోయేది మహేష్ బాబు తోనే అని అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. అయితే దీనిపై మాత్రం వారి నుండి అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: