ప్రభాస్ జాతీయ స్థాయికి ఎదిగిన స్టార్ అయ్యాడు. బాహుబలితోనే ఆ రేంజి అందుకున్న ప్రభాస్ కి సాహో చేదు ఫలితాన్ని మిగిల్చినా కూడా బాలీవుడ్లో మాత్రం హిట్ అయింది. అంటే అది పూర్తిగా ప్రభాస్ ఇమేజ్ అన్న సంగతి తెలిసిందే.  ఇక ప్రభాస్ తరువాత ఏం చేస్తాడన్నది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఇపుడు  ప్రభాస్ జాన్ మూవీ చేస్తున్నాడు, ఈ మూవీలో కూడా అనేక మార్పులుచేర్పులు ఉన్నాయి. ఈ మూవీ తరువాత మాత్రం ప్రభాస్ కచ్చితంగా కీలకమైన డెసిషన్ తీసుకుంటాడని అంటున్నారు.


ప్రభాస్ పూరీ జగన్నాధ్ కి డేట్లు ఇస్తాడన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రభాస్ తో పూరీ సినిమా చేయాలన్న కసితో ఉన్నారని కూడా అంటున్నారు. పూరీకి ఒక డ్రీమ్  ప్రాజెక్ట్ ఉంది. అదే జనగణమన. ఈ టైటిలే చాలా వైబ్రేషన్స్ ఇస్తుంది. మరి ఇలాంటి టైటిల్ ను మోయాలంటే టాలీవుడ్లో కొందరు హీరోలకు  మాత్రమే సాధ్యం. ఆ బరువు బాధ్యతలు వారికే సొంతం.అయితే మొదట ఈ మూవీని పూరీ మహేష్ తో తీయాలనుకున్నారు. నిజానికి మహేష్ కి రెండు హిట్లు కూడా పూరీ ఇచ్చాడు. కానీ మహేష్ ఎందుకో వెనక్కు తగ్గాడు. తరువాత పూరీకి కూడా డౌన్ ఫాల్ మొదలైంది. టెంపర్ మోస్తరు  హిట్ తరువాత ఆయన వైపు స్టార్ హీరోలు చూడడం మానేశారు.


ఈ నేపధ్యంలో పోతినేని రామ్ తో ఇస్మార్ట్ శంకర్ తీశాడు ప్రభాస్. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఆ మూవీ పెద్ద హిట్ అయింది.దాంతో ఫామ్ లోకి వచ్చిన పూరి ఇపుడు విజయ్ దేవరకొండతో మూవీ చేస్తున్నాడు. దీని తరువాత వరసగా టాలీవుడ్ స్టార్లను టచ్ చేయాలని పూరీ డిసైడ్ అయ్యాడట. పూరీ ఇపుడు ప్రభాస్ మీద చూపు పెట్టాడట. ప్రభాస్ సైతం సాహో ఫ్లాప్ తో ఉన్నాడు. జాన్ తరువాత ఆయన పూరీకి డేట్లు ఇవ్వవచ్చు అంటున్నారు. ఈ లోగా  విజయ్ సినిమా కూడా హిట్ కొట్టాలి.


అది కనుక జరిగితే ఈ ఇద్దరి కాంబోలో జనగణమన మూవీ రావడం ఖాయమని అంటున్నారు. ఈ మూవీ పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీస్తాడని ప్రభాస్ కూడా  నమ్ముతున్నాడట. పూరీని బాగా ఇష్టపడే హీరోలో ప్రభాస్ ఒకడు. ఇంతకు ముందు ఏక్ నిరంజన్, బుజ్జిగాడు మూవీస్ పూరీ ప్రభాస్ కలిసి  చేశారు. ఈసారి మాత్రం అదిరిపోయే హిట్ కొట్టాలని అనుకుంటున్నారుట.


మరింత సమాచారం తెలుసుకోండి: