‘సాహో’ విడుదలై 15 రోజులు దాటి పోవడంతో ఆ షాక్ నుండి తేరుకుని ప్రభాస్ నెమ్మదిగా అందరితో కలుస్తున్నాడు. దీనిలో భాగంగా ఈమధ్య జరిగిన గోపీచంద్ కొడుకు పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ప్రభాస్ ను ఆ ఫంక్షన్ కు వచ్చిన కొంతమంది ‘సాహో’ ఫలితం గురించి మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు వారందరికీ ప్రభాస్ చిరునవ్వు మాత్రమే సమాధానంగా వచ్చిందని ఇండస్ట్రీలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 

సాధారణంగా ఒక టాప్ హీరో సినిమా ఫెయిల్ అయినప్పుడు ఆ పరాజయానికి ఆ సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు పైనా లేదంటే ఆ సినిమాకు సరైన రివ్యూలు వ్రాయని మీడియా పైనా అభాండాలు వేస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈ తీరుకు భిన్నంగా ప్రభాస్ ‘సాహో’ పరాజయానికి ఎవరినీ పిన్ పాయింట్ గా కారణం అని చెప్పకుండా హుందాగా నవ్వుతు తన మంచి తనాన్ని వ్యక్తపరిచాడు అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఇది ఇలా ఉండగా ఈమూవీ రెండు వారాలు పూర్తి చేసుకునే సరికి 424 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ను వసూలు చేసింది అంటూ ‘సాహో’ మేకర్స్  మరొక లేటెస్ట్ ప్రకటన ఇచ్చారు. అయితే ఈమూవీ బయ్యర్లు నష్టాలు లేకుండా బయటపడాలి అంటే కనీసం మరో 75 కోట్ల గ్రాస్ కలక్షన్స్ రావలసిన పరిస్థితి ఉంది. 

ఇప్పటికే ఈ సినిమాను చూడాలి అని భావించేవారు అంతా ఈమూవీని చూసేసిన పరిస్థితులలో మరో 75 కోట్లు రావాలి అంటే ఏదైనా అద్భుతం జరగాలి. ‘సాహో’ కు  400 కోట్లకు పైగా కలెక్షన్స్ తెచ్చుకుని కూడ ఫ్లాప్ గా మారిపోవడం అత్యంత ఆశ్చర్యకర విషయం. ‘సాహో’ ఫలితం షాక్ నుండి తేరుకున్న ప్రభాస్ తన లేటెస్ట్ మూవీ విషయంలో అనేక మార్పులు చేర్పులు చేస్తూ దర్శకుడు జిల్ రాథా కృష్ణతో ఎడతెరిపి లేని చర్చలు జరుగుతున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: