ఇటీవల శుక్రవారం జరిగిన ఎపిసోడ్ బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఇంటి సభ్యులు విన్ అయితే కనుక డిన్నర్ పార్టీ ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ టాస్క్ కి ఏది నిజం ఏది అబద్దం అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఇంటి సభ్యులను కొంతమందిని సింగల్ గా మరి కొంతమందిని జంటగా సీక్రెట్ రూమ్ లోకి పిలిచి వారికి అక్కడ ఒక పని చెప్పి సీక్రెట్ రూమ్ లోకి వచ్చిన వాళ్ళు చేసిన పని బయట ఉన్న ఇంటి సభ్యులకు చెప్పి అది నిజమో కాదో ఇంటి సభ్యులు చెప్పాలి. ఇందులో భాగంగా సీక్రెట్ రూమ్ లోకి రాహుల్ వెళ్లిన సందర్భంలో బిగ్ బాస్ రాహుల్ తో గుంజీలు తీయడం జరిగింది. ఈ క్రమంలో సీక్రెట్ రూమ్ లో రాహుల్ కి అమ్మ ఫోన్ చేసిందని.. పెళ్లి సంబంధం కోసం మాట్లాడిందని  నమ్మించాలని టాస్క్ ఇవ్వడంతో రాహుల్ బిగ్ బాస్ బాస్ చెప్పినట్టే నమ్మించాడు.


మిగిలిన అందరి విషయాల్లో కరెక్ట్ గా గెస్ చేసిన శ్రీముఖి.. రాహుల్ విషయంలో కరెక్ట్ గా గెస్ చేయలేకపోయింది. రాహుల్ గుండెలపై తల పెట్టి అతని హార్ట్ బీట్ విని.. రాహుల్ నిజమే చెప్తున్నాడని డిసైడ్ చేసింది. వరుణ్, వితికా, హిమజ ఇలా కొంత మంది రాహుల్‌ చెప్పేది అబద్ధమనిపిస్తుందని చెప్పగా.. శ్రీముఖితో కలిపి ముగ్గురు మాత్రమే నిజం అని చేతులు ఎత్తారు. నేను చెప్తున్నాగా.. మీరు అబద్ధం అనుకుంటే మనకు బొక్కపడుతుందని అనడంతో అనుమానంగా ఇంటి సభ్యులు నిజమే అని చేతులు ఎత్తారు. అయితే అది తప్పని బిగ్ బాస్ చెప్పడంతో అందరూ తెల్లమొహాలు వేశారు.


దీంతో వరుణ్.. శ్రీముఖిపై విరుచుకుపడ్డాడు. నువ్ అనుకుంనే అనుకోవాలని కానీ మిగిలిన వాళ్లని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావని మండిపడ్డాడు. దీంతో శ్రీముఖి.. నా లాంగ్వేజ్ అంతే అని అరిచి చెప్పింది. దీంతో వరుణ్.. 'ఎప్పుడూ నువ్ మాట్లాడడమే కాదూ.. ఎదుటివారి మాటలను కూడా వినాలని' సలహా ఇచ్చాడు. నీ అభిప్రాయాన్ని అందరిపై ఎందుకు రుద్దుతున్నావు అంటూ సీరియస్ అయ్యాడు. దీంతో ఈ గొడవ చాలాసేపు హౌస్ లో జరుగగా శ్రీముఖి తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యి మొట్టమొదటిసారి హౌస్లో కంటతడి పెట్టింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: