టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ మూవీలు ఎన్నో వచ్చాయి.  మహేష్ బాబు తో పూరి జగన్నాథ్ ‘పోకిరి’, ‘బిజినెస్ మాన్’ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.  త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాన్ హీరోగా నటించిన ‘జల్సా’ , ‘అత్తారింటికి దారేది’ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.  అయితే వీరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి వచ్చిన ‘అజ్ఞాతవాసి’మాత్రం దారుణ ఫలితం పొందింది.  ఈ మూవీ ఇంట్రవెల్ వరకు అద్భుతం అనిపించినా..తర్వాత చిల్లరగా మారిందని టాక్ వచ్చింది. 

పవన్ కళ్యాన్ లాంటి స్టార్ హీరోకి ఇంత చెత్త సినిమా అందించిన త్రివిక్రమ్ పై అప్పట్లో బాగా విమర్శలు కూడా వినిపించాయి.  దాంతో వీరి మద్య ఇక మళ్లీ సినిమా ఉంటుందా?లేదా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి.  ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూవీస్ కూడా మంచి హిట్ అందుకున్నాయి. జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి, తాజాగా అలా వైకుంఠపురమున మూవీ తెరకెక్కుతుంది.    ‘అజ్ఞాతవాసి’ మూవీ తర్వాత పవన్ కళ్యాన్ కంప్లీట్ గా రాజకీయాలపై ఫోకస్ చేశారు. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ‘జనసేన’ తరుపు నుంచి పోటీ కూడా చేశారు..కానీ ఓడిపోయారు.  అయితే ఇప్పుడు మరోసారి పవన్ ని వెండితెరపైకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో 'పింక్' సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తాడని వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. తమిళంలో అజిత్ తో రీమేక్ అయిన ఈ సినిమా అక్కడ మంచి సక్సెస్ అందుకుంది. అందుకే దిల్ రాజు సినిమా తెలుగు హక్కులు సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ మొదట బాలకృష్ణతో అనుకున్నప్పటికీ..ఇప్పుడు పవన్ పేరుని తెర మీదకు తీసుకువచ్చారు.

ఇటీవల త్రివిక్రమ్ ఈ విషయమై పవన్ తో చర్చించాడట. ఈ మూవీ ఓ మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉండబోతుందని..త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవ్వడానికి ఓ కారణం ఉందని అంటున్నారు. ఒకవేళ పవన్ గనుక ఒప్పుకుంటే దిల్ రాజుతో కలిసి సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా చేస్తాడట. ఇదే నిజమైతే పవర్ స్టార్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: