ఇళయ దళపతి విజయ్ నటించిన  లేటెస్ట్ మూవీ బిగిల్.  షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం యొక్క ఆడియో  వేడుకను ఈనెల 19న  భారీ స్థాయిలో  నిర్వహించనున్నారు.  దాంతో తమ అభిమాన హీరో సినిమా  ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు  విజయ్ ఫ్యాన్స్. ఇక  పాసులు దొరికిన వారు ఈ ఈవెంట్ ను టీవీ లోనైనా  చూద్దాం అనుకున్నారు కానీ  ఇప్పుడు వారికీ నిరాశే ఎదురైంది. ఎందుకంటే  ఆ ఈవెంట్ ను  అనివార్యకారణాలవల్ల ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదని నిర్మాతలు ప్రకటించారు.  అయితే ఫ్యాన్స్ కు ఊరట కలిగించే విషయం ఏంటంటే  ఈనెల 22న సన్ టీవీలో  సాయంత్రం  ఈ ఆడియో వేడుక ప్రసారం కానుంది. ఇక  గతంలో సర్కార్ ఆడియో వేడుక కూడా గ్రాండ్ గా  జరుగగా అందులో విజయ్ సుదీర్ఘ ప్రసంగం  ఫ్యాన్స్ ను ఉర్రుతలూగించింది.  దాంతో విజయ్ ఈ సారి కూడా  అలాంటి ప్రసంగాన్నే ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట. 




అట్లీ డైరెక్షన్ లో  స్పోర్ట్స్  డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో విజయ్  డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.  భారీ బడ్జెట్ తో  ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ ఈచిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా ఏ ఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం  తమిళ, తెలుగు భాషల్లో భారీ అంచనాల మధ్య  దీపావళి కానుకగా  విడుదలకానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు విడుదలచేయనున్నాడు. కాగా అట్లీ -విజయ్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో  వచ్చిన  తెరి , మెర్సల్ చిత్రాలు బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: