గత ఆరేళ్లుగా ఆ నటి ఓ విషయం కోసం పోరాటం చేస్తున్నది. దాన్ని సాధించడానికి విపరీతంగా ట్రై చేస్తున్నది. కానీ, ఆ నటి దానిని అందుకోలేకపోతున్నది. దానిపై విజయం సాధించలేకపోతున్నది. ఒకప్పుడు అదేంటో ఎందుకు వస్తుందో అర్ధం అయ్యేది కాదట. కానీ, తరువాత దానిని అర్ధం చేసుకోవడం మొదలు పెట్టిన తరువాత కొంత వరకు అవగాహనాకు వచ్చింది. ఆ అవగాహనా నుంచి కొంత ఉపశమనం పొందింది. ఉపశమనం పొందిన తరువాత ఆ నటి దానిని అర్ధం చేసుకోవడం మొదలు పెట్టింది.
ఇంతకీ ఎవరు ఆ నటి.. ఆ నాటికీ వచ్చిన సమస్య ఏంటి.. ఎందుకు పోరాటం చేస్తోంది తెలుసుకుందాం. ఆషీకీ 2 సినిమా ద్వారా బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన హీరోయిన్ శ్రద్ధా కపూర్. వరసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది. సాహో సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం ఐయ్యింది. ఈ నటి సినిమా రంగంలోకి వచ్చినప్పటి నుంచి ఓ విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్నది.
ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా రియాక్ట్ అవుతున్నది. ఒక్కసారి ఆ రియాక్షన్ ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నది. దీంతో విపరీత పరిణామాలకు దారి తీస్తోంది. ఇలా విపరీతమైన పరిణామాలకు దారితీయడంతో తలా నొప్పి వంటివి వస్తుంటాయి. ఫలితంగా ఏమి చేయలేని పరిస్థితిలో పడిపోతుంది. చాలాసార్లు డాక్టర్ల దగ్గరకు వెళ్లి టెస్ట్ చేయించుకుందట. మానసికంగా ఒత్తిడి వలన ఇలాంటివి వస్తుంటాయని డాక్టర్లు చెప్పినట్టు శ్రద్దా కపూర్ పేర్కొన్నది.
తన మానసిక పరిస్థితిని ఇప్పుడిప్పుడే అర్ధం చేసుకుంటున్నానని, క్రమంగా బయటకు వస్తున్నానని, త్వరలోనే ఈ బాధ నుంచి బయటపెడతానని చెప్తోంది. ఈ బాధ నుంచి బయటపడటానికి పాపం శ్రద్దా చాలా ప్రయత్నాలే చేసింది. ఎక్కువ స్పందించకుండా ఉండేందుకు మెడిటేషన్ వంటివి చేస్తున్నది. మానసికంగా స్ట్రాంగ్ గా ఉండే డైట్ తీసుకుంటుంది. మరి ఈ సమస్య నుంచి ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.