ప్రియాంక చోప్రా ఓపికప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్. వరసగా బెస్ట్ సినిమాలు చేసింది. ఇప్పుడు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్ళిపోయింది. హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్నాక న్యూయార్క్ లోనే సెటిల్ అయ్యింది. అక్కడి నుంచే హాలీవుడ్ ప్రయత్నాలు చేస్తున్నది. పెళ్లి సమయంలో ఆమె స్కై ఈజ్ పింక్ అనే సినిమాను ఒప్పుకుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని అక్టోబర్ 11 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.
ఇదిలా ఉంటె, ఈ సినిమాను టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఈ టొరంటో ఫిలిం ఫెస్టివల్ కు ప్రియాంక బ్లాక్ అండ్ వైట్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చింది. కుందనపు బొమ్మలా ఉన్నది. ఈ సినిమా చూసిన తరువాత ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ ను చూసి ప్రియాంక కన్నీళ్లు పెట్టుకుంది. చాలా కాలం తరువాత ఆమె సినిమాలో చూసుకుంది. సినిమాపై పెట్టుకున్న నమ్మకం నిజమైంది.
15 సంవత్సరాలకే వక్తగా, రచయితగా పేరు తెచ్చుకున్న ఆయెషా చౌదరి జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కింది. అయితే, అరుదైన వ్యాధి కారణంగా 18 సంవత్సరాల వయసుకే ఆమె మరణించింది. ఆమె మరణం ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది. ఆమె రాసిన పుస్తకం రిలీజైన మరుసటి రోజునే మరణించడం విషాదం అని చెప్పాలి. అయేషా చౌదరి పాత్రలో జైరా వాసిం నటించింది.
ఫర్హాన్ అక్తర్, జైరా వాసిం, ప్రియాంక చోప్రా తదితరులు నటించిన ఈ సినిమాకు సోనాలి బోస్ దర్శకత్వం వహించారు. భావోద్వేగాలతో మిళితమైన ఈ సినిమా టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించడం సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. అక్టోబర్ 11 తరువాత ఈ సినిమా మంచి వసూళ్లు సాధించడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్కై ఈజ్ పింక్ తరువాత బాలీవుడ్ లో మరో సినిమా ఒప్పుకోలేదు ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ప్రియాంక దృష్టి బాలీవుడ్ మీద, పిల్లలపైనా పెట్టింది.