టాలీవుడ్ లో దర్శకుడిగా పరిచయం అయిన అడవి శేష్ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. ఆ తర్వాత హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ‘క్షణం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘గుఢాచారి’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. విభిన్న తరహా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ ని ఏర్పర్చుకున్నాడు యంగ్ హీరో అడవి శేష్.
ఇటీవల మరోసారి అడవి శేష్ ‘ఎవరు’ అనే థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులని మెప్పించాడు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్న హీరో. రెగ్యులర్ సినిమాలు చేయకుండా స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలు. ఈ సినిమా కలెక్షన్స్ తోపాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ మూవీలో కావాల్సినంత ఉత్కంఠతో పాటు కథలోని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి.
నిజాల్ని తెలుసుకునే ప్రయత్నంలో అబద్దాలు ఎవరిని దోషిగా తేల్చాయన్నది ఆకట్టుకునే అంశంగా మిగిలిపోతుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ మూవీపై విమర్శకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. పలువురు టాలీవుడ్ స్టార్స్ కూడా ఈ మూవీ అద్భతంగా ఉందని ట్వీట్స్ చేశారు. విదేశాలలోనూ విడుదలైన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది.
ఇటీవల జపనీస్ ఫ్యాన్ రినా టోక్యోలో జపనీస్ డబ్బింగ్ వర్షన్ చూసింది. ఇండియలోను సినిమా చూడాలని హైదరాబాద్కి వచ్చింది. ఈ సందర్భంగా ఎవరు హీరో అడవి శేష్ని కలుసుకొని కన్నీటి పర్యంతమైంది. సినిమా తనకెంతో నచ్చిందని తెలిపింది. సరదాగా అడవి శేషుతో కొద్ది సేపు ముచ్చటించింది. ఈ సందర్భంగా అడవి శేషు.. జపనీస్ అభిమాని తనను కలుసుకుని, తనపై చూపించిన ప్రేమను తెలుపుతూ ట్వీట్టర్ లో వీడియోను పోస్ట్ చేశాడు.