నందమూరి నట సింహం బాలయ్య బాబు  ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్  కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  కాగా  ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్ ప్రస్తుతం  హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది.  అయితే ఈ షెడ్యూల్ లో ఫుల్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.  ప్లాష్ బ్యాక్ లో ఈ సన్నివేశాలు వస్తాయి.  బాలయ్య  ఓ హోమం జరుపుతుండగా విలన్స్ బాలయ్య పై అటాక్ చేస్తారు. ఈ క్రమంలోనే బాలయ్య వారితో భారీ ఫైట్ చేస్తాడట.  కాగా రేపటి షూటింగ్ తో  ప్లాష్ బ్యాక్ లో వచ్చే యాక్షన్ పార్ట్ మొత్తం పూర్తవుతుందట.  ఆ తరువాత జరగబోయే షెడ్యూల్ లో కీలకమైన ఫ్యామిలీ  సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఈ సన్నివేశాల్లో బాలయ్య - భూమిక చావ్లా మధ్య వచ్చే సీన్స్ తో పాటు  కొన్ని కామెడీ సీన్స్ ను ఉంటాయట. పైగా  ఈ సీన్స్ లో  జయసుధ, రావు రమేష్ కూడా ఉన్నారట.   అయితే ఈ సినిమా గురించి సి కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ.. 'సినిమాలో బాలయ్య రెండు గెటప్ ల్లో కనిపించనున్నారని.. రెండో గెటప్ లో బాలయ్య ఇంకా యంగ్ లుక్ లో కనిపించనున్నారని.. ఈ లుక్స్ కోసం బాలయ్య రోజుకి ఐదు గంటలు వ్యాయామం చేస్తున్నారని..  చెప్పుకొచ్చారు. ఈ వయసులో కూడా  బాలయ్య ఆ రేంజ్ లో  కష్టపడటం నిజంగా గ్రేటే. ఇక ఇటీవ‌లే  విడుద‌లైన బాలయ్య ఫస్ట్ లుక్‌ కి  ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. మరి రెండో లుక్ కి ఇక ఏ రేంజ్ లో ఆదరణ దక్కుతుందో  చూడాలి.   

   

కాగా దర్శకనిర్మాతలు  ఈ సినిమాకి రూలర్ అనే  టైటిల్ పెట్టాలని  ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి బాలయ్య మళ్లీ పవర్ ఫుల్ టైటిల్ తో రాబోతున్నాడు.  అయితే ఈ  టైటిల్ కి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  ఇక ఈ చిత్రంలో  రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న బాలయ్య సరసన  సోనాల్ చౌహాన్ అండ్  వేదిక  హీరోయిన్లుగా  నటించనున్నారు.  అయితే  వేదిక  మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది.  అలాగే ఓ కీలకమైన పాత్రలో  నమితను కనిపించనుంది.  నమితది  నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర..  ముఖ్యంగా సినిమాలో  బాలయ్యకి విలన్ గా  కనిపించనుంది.  ఇప్పటికే  సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది.  ఇక  ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు  పవర్ ఫుల్ విల‌న్‌ గా న‌టించ‌బోతున్నాడు.  బ్లాక్‌బ‌స్ట‌ర్ `లెజెండ్‌` త‌ర్వాత బాల‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో ఈ చిత్రం రూపొంద‌నుంది.  ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ సంగీత సార‌థ్యం వహిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత, సి.కె.ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: