టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి  దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి.  స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాని మెగా పవర్‌ రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.  భారీగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోవాలంటే సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండాలి..మెగా ప్యాన్స్ కు పండుగ చేసుకునేలా ఉండాలి. ఇవన్నీ ఆలోచించే  ఈ సినిమాలో రకరకాల సర్పైజ్ లు దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

తాజాగా సమాచారం మేరకు ఈ సినిమాలో అల్లు అర్జున్, రామ్ చరణ్ ఓ సీన్ లో అలా వచ్చి కనిపించి వెళ్తారు. సెకండాఫ్ లో ఆ సీన్ వస్తుంది అని సమాచారం. అలాగే ఫస్టాఫ్ లో మరో సర్పైజ్ ఉందని తెలుస్తోంది. అనుష్క సైతం ఓ చిన్న పాత్రలో కనిపించి అలరించనుందని చెప్తున్నారు. అయితే రిలీజ్ అయ్యేదాకా వాటిని దాచి పెట్టాలని టీమ్ భావిస్తోందిట. విడుదల అనంతరం జనం గెస్ట్ రోల్స్  గురించి మాట్లాడుకుంటే బజ్ క్రియేట్ అవుతుందని ప్లాన్ చేస్తున్నట్లు  సమాచారం.  ఇకపోతే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సైరా వచ్చే నెల 2 న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కాబోతుంది. 

ఈ సమయంలో సైరా కి అనుకోని షాక్ తగిలింది. తమకు న్యాయం చేయాలంటూ ఉయ్యాలవాడ వంశీ యులు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చిరంజీవి కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.సైరా నరసింహారెడ్డి సినిమా తీసేందుకు కావలసిన పూర్తి సమాచారంతో పాటు ,సినిమా షూటింగ్ చేసుకునేందుకు అవసరమైన లొకేషన్ లతో పాటు, నరసింహారెడ్డి జీవిత చరిత్రను పూర్తిగా తమనుండి తెలుసుకొన్నారని అన్నారు. సినిమాకు కావాల్సిన పూర్తి సమాచారం తెలుసుకుని షూటింగ్ ను పూర్తి చేసుకొని ఇప్పుడు తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చిరంజీవి తమకు న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారని కానీ ప్రస్తుతం తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైరా వంశీయులు ధర్నా చేస్తున్నారనే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి వచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై చిత్ర యూనిట్ ఇంకా స్పందించలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: