తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్-3 రసవత్తరంగా కొనసాగుతోంది. రెండు సీజన్ లు కూడా మంచి రేటింగ్ తో పూర్తి చేసుకుని, ఇప్పుడు మూడో సీజన్ నాగార్జున హోస్టింగ్ తో కొనసాగుతుండగా, ఈ రోజు నాగార్జున మాత్రం సీరియస్ గానే హోస్టిం చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ హాట్ హాట్‌గా మారింది. ఎప్పుడూ మోడల్స్‌ తో డ్యాన్సు చేస్తూ...అయితే ఎప్పుడు ఊషారుగా హుషారెత్తించే నాగార్జున ఈ రోజు ఎపిసోడ్‌లో చాలా సీరియస్‌గా ఉన్నారు. ఈరోజు డాన్స్‌లు పాటలు వద్దు.. నాకు మండిపోతుంది.. బిగ్ బాస్ హౌస్‌ కంటెస్టెంట్స్‌పై పీకలదాకా కోపం ఉంది. వెంటనే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలి అంటూ మహేష్, శ్రీముఖి, పునర్నవిలకు క్లాస్ పీకుతున్నారు.

 

అయితే ఇందులో శ్రీముఖిని గాడిదతో పోలుస్తూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు బిగ్ బాస్. గత రాత్రి ఎపిసోడ్‌లో.. ఆమె ఇంటి సభ్యుల్ని తప్పుదారి పట్టించి విధానాన్ని పాయింటౌట్ చేస్తూ నాగార్జున ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీముఖి.. నీ ఆట ఎలా ఉందో తెలుసా? కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు అన్నట్లు ఉందంటూ వార్నింగ్ ఇచ్చారు. నువ్ బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్‌వి కాదు.. బిగ్ బాసే అందరికీ బాస్.. నీ ఆట నువ్ ఆడుకో’అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నాగార్జున. అలాగే పునర్నవికి నాగ్ గట్టి వార్నింగే ఇచ్చేశారు. కొన్ని టాస్క్ ల విషయంలో సరిగ్గా ఆడకుండా బిగ్ బాస్ లు గట్టిగా మాట్లాడటంపై ‘గురివింద గింజ’ తో పోల్చారు. పైన తెలుపు..కింద నలుపు అంటూ సెటైర్లు వేశారు. పైన ఉన్న తెలుపు తప్పా…కింద  ఉన్న నలుపు గుర్తించలేకపోతున్నావంటూ వార్నింగ్ ఇచ్చారు. అలాగే ముందుగా మహేష్ కు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇలా అందరిని గట్టిగానే క్లాస్ పీకారు.


మరింత సమాచారం తెలుసుకోండి: