‘నా పేరు సూర్య’ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో “అల వైకుంఠపురములో” అనే సినిమా ప్రస్తుతం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు రావడం జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చేస్తున్న “అల వైకుంఠపురములో” అనే సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి ఇద్దరూ ఈ సినిమాని చాలా తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ‘నా పేరు సూర్య’ తో దారుణమైన డిజాస్టర్ చూసిన బన్నీ ఈ సినిమాతో పోయిన మార్కెట్ మళ్లీ తిరిగి సంపాదించుకోవడానికి క్రేజ్ పెంచుకోవడానికి డైరెక్టర్ త్రివిక్రమ్ తో అదిరిపోయే ఐడియా వేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.


ఈ నేపధ్యంలో చేస్తున్న ఈ సినిమాని మలయాళం తెలుగు తో పాటు తమిళం మరియు హిందీ భాషలలో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మలయాళంలో అల్లు అర్జున్ కి మంచి మార్కెట్ ఉంది అయితే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తెలుగు సినిమాల స్టోరీలు అద్భుతమైన ఫలితాలు రాబడుతున్నాయి. దీంతో “అల వైకుంఠపురములో” ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ ఎత్తున విడుదల చేయాలని సినిమా యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం.


ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అంతేకాకుండా చాలా కాలం తర్వాత ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టాబు రీఎంట్రీ ఇవ్వటం విశేషం. మరోపక్క సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతిని టార్గెట్ చేసుకుని రాబోతున్న ఈ సినిమా చాలా భాషల్లో విడుదల చేసి లాభాలు సాధించాలని త్రివిక్రమ్ అల్లు అర్జున్ ప్లాన్ వేసినట్లు ఈ వార్త ఫిలింనగర్లో మరియు సోషల్ మీడియాలో బాగా వినబడుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: