బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా కోసం హీరోయిన్ ను ఫైనల్ చేసినట్టు లేటెస్ట్ అప్డేట్. డి.జె, అరవింద సమేత, మహర్షి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన పూజాహెగ్డేను హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసినట్టు చిత్రం యూనిట్ ప్రకటించారు. అఖిల్, పూజా హెగ్డే జోడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని దర్శక నిర్మాతలు ధీమాగా ఉన్నారు.
అక్కినేని నాగేశ్వరావు గారి, అక్కినేని నాగార్జున గారి నట వారసుడుగా పరిచయమైన అఖిల్ అక్కినేని తన సినిమాల ద్వారా ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. తను చేసిన హలో, మిస్టర్ మజ్ను లాంటి లవ్ కమ్ ఫ్యామిలి ఎంటర్టైనర్స్ తో అక్కినేని అభిమానులనే కాకుండా ఫ్యామిలి అండ్ గర్ల్స్ సెక్టార్ లో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే తను ఇప్పటివరకు నటించిన సినిమాలేవి పెద్దగా కమర్షియల్ సక్సస్ ను అందుకోలేకపోయాయి. ప్రస్తుతం అఖిల్ టార్గెట్ ఒక కమర్షియల్ హిట్ దక్కించుకోవడమే.
బొమ్మరిల్లు చిత్రం ఇప్పటికి ట్రెండ్ సెట్టర్ ఇన్ లవ్ అండ్ ఫ్యామిలి ఎంటర్టైనర్ గా నిలిచిపోయిందంటే అది కేవలం దర్శకుడు భాస్కర్ విజన్ అండ్ వాల్యూస్ అని చెప్పాలి. ఆ తరువాత వచ్చిన పరుగు సినిమా కూడా మంచి సక్సస్ ను ఇచ్చింది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ లో భాస్కర్ కి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ వుంది. ఇప్పుడు వీరద్దిరి కాంబినేషన్ లో సినిమా వస్తుందనగానే కాస్త అంచనాలు పెరిగాయి. గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మెగా హీరోలు కాకుండా చేసిన సినిమా 100% లవ్. ఈ సినిమాలో అక్కినేని నట వారసుడు నాగ చైతన్య హీరోగా సుకుమార్ దర్శకత్వంలో బన్ని వాసు నిర్మించాడు. ఆ సినిమా మంచి కమర్షియల్ హిట్ ను అందుకుంది. మళ్ళీ ఇప్పుడు ఖిల్ అక్కినేని హీరోగా నిర్మాతలు బన్ని వాసు, వాసు వర్మలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనైనా అఖిల్ హిట్ కొడతాడేమో చూడాలి.