తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ఇప్పటికే 50 రోజులు దాటిన విషయం తెలిసిందే.  నిన్న వీక్ ఎండ్ సందర్భంగా శనివారం కింగ్ నాగార్జున బిగ్ బాస్ ఇంటి సభ్యులతో భలే గేమ్ ఆడుకున్నాడు.  ఇప్పటికే ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఫినాలేకు ప్రిపేర్ కావాలని చెప్పాడు.  దాంతో ఇంటి సభ్యుల మద్య కాస్త భయం భక్తులు పెరిగినట్లే అనిపిస్తుంది..గెలుపు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు మొదలు పెట్టారు.  ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఒక్కొక్కరి మనసులో ఉన్నది బహిరంగంగానే చెప్పేశారు.  మహానటి, అంతకు మించి గేమ్ లో ఇంటి సభ్యుల్లో ఎవరు ఎవరి పాత్రల గురించి చెప్పారు.

ఇదే సమయంలో పునర్నవి, రాహూల్ మాద్య మాటల యుద్దం జరిగింది.  ఇక శనివారం నాగ్ రాగానే నేను చాలా సీరియస్‌గా ఉన్నా.. కంటెస్టెంట్స్‌పై పీకల వరకూ ఉంది. వాళ్లతో చాలా మాట్లాడాలి అంటూ బిగ్ బాస్ హౌస్‌‌ని మన టీవీ ద్వారా షాకింగ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున తన షూ తీసుకొని నేను నా షూ పాలిష్ చేసుకుంటున్నాను..ఎందుకో తెలుసా ఇది తప్పుపని కాదు..మన గౌరవం ఏమీ పడిపోదు అన్నారు. కాని నేను ఈరోజు పాలిష్ ఎందుకు చేస్తున్నా అంటే.. ఏ పని చిన్నది కాదు అని చెప్పడానికి. చేసే పనిని బట్టి మనిషి స్థాయి తగ్గడం పెరగడం ఉండదు. 

మన గౌరవం మనం చేసే పనులను బట్టి ఉంటుంది..బిగ్ బాస్ లోకి వచ్చినపుడు అన్నింటికి సిద్ద పడ్డారని..ఏ గేమ్ అయినా..టాస్క్ అయినా ఆడేందుకు సిద్దంగా ఉన్నామని మాటలు చెప్పడం కాదు..చేసి చూపించాలి.  ''నా షూని నేను రోజూ పాలిష్ చేసుకోను. చేసే తీరుని బట్టే ఉంటుంది'' అని మహేశ్, పునర్నవిలకు క్లాస్ పీకారు.  అంతే కాదు డ్రాయర్‌లు ఉతకడం అంటూ ఏదేదో మాట్లాడావు. మాకు ఇవన్నీ అవసరమా? అంటున్నావ్. నువ్ ఏమీ ఇక్కడ ఇరగదీయడం లేదు. ఇన్విటేషన్ మీద వచ్చావా? నీ ఇన్విటేషన్ క్యాన్సిల్ చేస్తున్నా.. బిగ్ బాస్ డోర్లు తెరుస్తున్నా.. నువ్ ఇప్పుడే వెళిపోవచ్చు'' అంటూ మహేశ్ పై సీరియస్ అయ్యారు.

మొత్తానికి నువు నీ టాస్క్ పూర్తి చేశావు కనుక నిన్ను బిగ్ బాస్ లో ఉంచుతున్నామని అన్నాడు.  ఇక పునర్నవి బిగ్ బాస్ ని బూతులు తిట్టిన వైనంపై నాగార్జున ఫైర్ అయ్యారు. దీంతో క్షమాపణలు చెప్పింది పునర్నవి. ఇక శ్రీముఖిపై కూడా నాగార్జున సీరియస్ అయ్యారు. ఇక పునర్నవిని కూడా వదల్లేదు..ఇంట్లో నీ ఆట ఆడటానికి వచ్చావు..పక్కవారిని ఆడించడానికి కాదు అంటూ అందరికి క్లాస్ పీకారు నాగార్జున. 


మరింత సమాచారం తెలుసుకోండి: