ప్రతి సినిమాకు స్టయిల్ చేంజ్ చేస్తూ ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడని హీరోల్లో ‘సూర్య’ ఒకరు. కాగా సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘బందోబస్త్’. డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకుడు. బందోబస్త్ కథ భారత దేశం మొత్తానికి సంబందించిన కథ. వ్యవసాయం, రాజకీయాలు, దేశభద్రత వంటి ప్రధానాంశాల సమాహారంగా తెరకెక్కిన చిత్రం ఇది. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక వ్యక్తి సోషల్ వాల్యూస్ వదిలేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి. అసలు ఇంతకీ ఆ వ్యక్తి అలా మారడానికి కారణాలేమిటి ? ప్రధాన మంత్రి ఆఫీస్ లో వాస్తవంగా ఎటువంటి సంఘటలు జరుగుతాయి అనే అంశాలు ఆకట్టుకుంటాయి. ఈ విషయాలు సినిమాలో చాలా బాగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ...


సూర్య మాట్లాడుతూ "ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఇంత భారీగా తారాగణం, ఉన్నత నిర్మాణ విలువలతో రావడానికి కారణమైన లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ గారికి థాంక్స్. మా టీమ్ అందరి కలను ఆయన నిజం చేశారు. సెప్టెంబర్ 20న తెలుగులోనూ భారీ ఎత్తున సినిమాను విడుదల చేస్తున్న ఎన్వీ ప్రసాద్ గారికి థాంక్స్. లైకా ప్రొడక్షన్స్, ఎన్వీ ప్రసాద్ గారి అమేజింగ్ అసోసియేషన్ గురించి నాకు ఈ రోజు తెలిసింది. ఇక్కడికి వచ్చిన సురేష్ బాబుగారికి థాంక్స్.  మీరు ఇచ్చే కిక్, హై డిఫరెంట్. ఈ 'బందోబస్త్' కంప్లీట్ ఎంటర్‌టైనర్ ఫిల్మ్. మీ అందరికీ నచ్చుతుంది. జర్నలిస్ట్ బ్యాగ్రౌండ్ నుండి కెవి ఆనంద్ సార్ వచ్చారు. రియల్, ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఆయన సినిమాలు తీస్తారు. ఈ సినిమానూ అలాగే తీశారు. ఈ చిత్రంలో సాయేషా హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని ఆర్య ముందు కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో త‌న‌తో న‌టించాలంటే ఇబ్బంది ప‌డ్డాన‌ని తెలిపారు. తన భ‌ర్త ముందు అలాంటి సీన్స్ చెయ్యాలంటే చాలా ఇబ్బంది అనిపించిందని కాని ఆర్య మాత్రం చాలా మంచి వార‌ని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: