అఖిల్ సినిమాలో హీరోయిన్ గా నటించిన భామ సాయేషా సైగల్ తమిళ హీరో ఆర్య ని కొంతకాలం ప్రేమించి పెళ్ళాడింది. బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ మనవరాలు అయిన సాయేషా సైగల్ తెలుగు , తమిళ , హిందీ చిత్రాల్లో నటించింది . అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ కొట్టలేకపోయింది . దాంతో ఆర్య తో లవ్ లో పడింది . ఇన్నాళ్లు ప్రేమని ఎంజాయ్ చేసిన ఈ జంట మార్చిలో పెళ్లి చేసుకున్నారు.


ఇదిలా ఉంటే తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ క‌లిగిన  త‌మిళ హీరోల్లో సూర్య ఒక‌రు. గ‌జిని, య‌ముడు, సింగం వంటి సినిమాలు ఆయ‌న‌కు తెలుగు ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చాయి. ప్ర‌తి సినిమాకు స్ల‌యిల్ చేంజ్ చేస్తూ ప్ర‌యోగాలు చేయ‌డానికి ఏమాత్రం వెనుకాడ‌ని హీరో సూర్య న‌టిస్తున్న తాజా చిత్రం బందోబ‌స్త్‌. ఆ చిత్రంలో సాయేషా సూర్య ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టించింది. ఇటీవ‌లె ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ... ఫస్ట్ టైమ్ సూర్యగారితో నటించాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి నటించాలనేది నా డ్రీమ్. సూర్యగారితో పని చేస్తుంటే మనమూ ఎక్కువ కష్టపడతాం. కళ్లలో వెయ్యి భావాలు పలికిస్తారు. నా క్యారెక్టర్ చాలా బావుంటుంది. కెవి ఆనంద్ గారు కేవలం పాటలు, డ్యాన్సుల కోసం హీరోయిన్ క్యారెక్టర్స్ రాయరు. కథలో వాళ్లకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోయిన్లకు నటించే అవకాశం దొరుకుతుంది. ఇంకా చాలా చేయవచ్చు. కెవి ఆనంద్ గారి దర్శకత్వం నటించడం నా అదృష్టం. నా క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉంటాయి. మిస్టీరియస్ క్యారెక్టర్. కథను ముందుకు తీసుకు వెళుతుంది. గొప్ప టీమ్ తో కలిసి చేసిన అద్భుతమైన సినిమా ఇది. మేమంతా సినిమా కోసం చాలా కష్టపడ్డాం.  సెప్టెంబర్ 20న మీరందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడండి" అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: