అక్కినేని నాగార్జున మన్మధుడు -2 మూవీ ఫెయిల్ కావడంతో కొంత డిప్రెషన్లోకి వెళ్లాడు. ఆ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కూడా. అరవైలో  ఇరవై వేషం వేసిన నాగ్ కి ఆడియన్స్ రిప్లై ఏ మాత్రం నచ్చడంలేదుట. దాంతో నాగ్  తరువాత మూవీ విషయంలో బాగా ఆలోచించేందుకు టైం ఎక్కువగా తీసుకుంటున్నాడు. ఈ లోగా బిగ్  బాస్ సీజన్ 3 కి హోస్ట్ గా నాగ్ వ్యవహ‌రిస్తున్నాడు.  అక్టోబర్ తో బిగ్ బాస్ జాబ్ ముగుస్తొంది. 


దాంతో నాగ్ కొత్త సినిమాను పట్టాలకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. నాగ్ ఇపుడు సొగ్గాడు చిన్ని  నాయన మూవీ సీక్వెల్ చేయడంలేదని టాక్. ఎందుకంటే అందులో రొమాన్స్ టాప్ రేంజిలో ఉంటుంది. మన్మధుడు 2 ఫలితం తరువాత ఇపుడు మళ్ళీ అదే ట్రాక్ లో వెళ్తే దెబ్బ పడిపోతుందని నాగ్ భావిస్తున్నట్లుగా ఉన్నాడు. దాంతో  ట్రాక్ మార్చి వేరే జోనర్లో మూవీకి ప్రిఫర్ చేస్తున్నాడుట.


సరిగ్గా ఆ టైంలో స్క్రిప్ట్ రైటర్ సోల్‌మన్ చెప్పిన కధ ఒకటి నాగ్ ని ఆకట్టుకుందని అంటున్నారు. సోల్‌మన్ చెప్పిన కధతో ముందుకు వెళ్తే హిట్ ఖాయమని కూడా నాగ్ భావిస్తున్నాడుట. దాంతో కొత్త డైరెక్టర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. నవంబర్ నుంచి షెడ్యూల్ పెట్టుకుంటున్నారుట. ఈ మూవీని శరవేగంగా పూర్తి చేసి సమ్మర్ కి తీసుకురావాలని నాగ్ డిసైడ్ అయ్యాడట.


ఇక బంగర్రాజు మూవీ ఎపుడు అంటే ఇపుడే చెప్పలేమని అనేస్తున్నారు. ఈ మూవీ కోసం కురసాల కళ్యాణ్ కధని రెడీ చేసి పెట్టాడు. అయితే నాగ్ సోల్‌మన్  తో మూవీకి రెడీ అయిపోవడం,  ఈ మూవీలో నటించాల్సిన నాగ చైతన్య కూడా బిజీ అయిపోవడంతో వచ్చే ఏడాది చివరకు కానీ సెట్స్ మీదకు బంగార్రాజు రాదని చెబుతున్నారు. చూడాలి మరి నాగ్ ఎలా ప్లాన్ చేస్తాడో.


మరింత సమాచారం తెలుసుకోండి: