‘సైరా’ మూవీలో కీలక పాత్రను అమితాబ్ బచన్ పోషించిన పరిస్థితులలో ఆ పాత్రకు అమితాబ్ ను ఒప్పించడానికి రామ్ చరణ్ చాల కష్టపడవలసి వచ్చింది అని అంటారు. వాస్తవానికి ఈ మూవీలో నటించడానికి అమితాబ్ ఏమాత్రం ఆసక్తి కనపరచలేదు అని టాక్. 

అయితే అమితాబ్ కేవలం రెండు రోజుల సమయం కేటాయిస్తే చాలు అని చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి బలవంత పెట్టడంతో అమితాబ్ ఈ మూవీలోని తన అతిథి పాత్రకు అయిష్టంగానే అంగీకరించాడు అని అంటారు. అయితే షూటింగ్ స్పాట్ కు వచ్చిన తరువాత ఈమూవీ నిర్మాణం జరుపుకుంటున్న భారీతనం గురించి ముఖ్యంగా ఉయ్యాలవాడ చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకుని ఈ మూవీలో నటించినందుకు తనకు గర్వంగా ఉంది అంటూ చిరంజీవితో చెప్పినట్లు వార్తలు కూడ వచ్చాయి. 

ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత అమితాబ్ కు పారితోషికాన్ని ఇచ్చే ప్రయత్నం చరణ్ చేస్తే ఆ విషయాన్ని సున్నితంగా అముతాబ్ తిరస్కరించడమే కాకుండా తాను ఈ మూవీని కేవలం చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యం కోసం నటించాను అంటూ చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ‘సైరా’ విడుదలకు సిద్ధమై ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కౌంట్ డౌన్ మొదలు కావడంతో చరణ్ అమితాబ్ ను వ్యక్తిగతంగా ఈ ఫంక్షన్ కు ఆహ్వానించడానికి వెళ్లి తనకు ఇచ్చిన గిఫ్ట్ చూసి అమితాబ్ షాక్ అయినట్లు సమాచారం. 

తెలుస్తున్న సమాచారం మేరకు చిరంజీవి తన కూతురు సుస్మిత చేత స్పెషల్ గా డిజైన్ చేయించిన వజ్రాలు పొదిగిన ఒక బంగారు బ్రాస్ లెట్ అమితాబ్ కోసం పంపినట్లు తెలుస్తోంది. దీనివిలువ కోటి రూపాయల వరకు ఉంటుంది అని అంటున్నారు. ఈ విలువైన బహుమతిని చూసి అమితాబ్ ఆనందంతో షాక్ అయినట్లు తెలుస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: