తెలుగులో హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. కానీ ప్రస్తుతం టాప్ హీరోయిన్ ఎవరంటే చెప్పడం కొద్దిగా కష్టమే! ఎందుకంటే సమంత తర్వాత ఆ స్థాయి ఇంకా ఎవరికి రాలేఅనె చెప్పాలి. సమంత పెళ్ళి చేసుకున్న తర్వాత మరిన్ని సినిమాలు చేసి విజయాలు సాధిస్తుంది. కాకపోతే ఆమె చేసే చిత్రాలలో, హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలకే ఎక్కువ ప్రాముఖ్యతని ఇవ్వడంతో టాప్ హీరోయిన్ ప్లేస్ నుండి పైకి ఎగబాకింది.


ప్రస్తుతం ఆ ప్లేస్ ఖాళీగా ఉందనే చెప్పాలి. ఇక ఆ ప్లేస్ ని భర్తీ చేసే వారిలో ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. మొదటగా రష్మిక. ఛలో సినిమా ద్వారా తెలుగులో అడుగు పెట్టి, గీత గోవిందం సినిమాతో ఎక్కడ లేని క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె కెరీర్ ఊపందుకుంది. అవకాశాలు వెల్లువలా వచ్చాయి. అవకాశాలని అందిపుచ్చుకుంటూ వరుస సినిమాలు చేస్తుంది.


ఆమె నటించిన దేవదాసు, డియర్ కామ్రేడ్ సినిమాలు పరాజయం చవి చూసినప్పటికీ, ఈ అమ్మడుకి అవకాశాలు మాత్రం తగ్గట్లేదు. ప్రస్తుతం మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ , నితిన్ తో భీష్మ , అలాగే సుకుమార్ – అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కనున్న ఓ సినిమాలో నటిస్తుంది. ఇవే అనుకుంటే తాజాగా నాగ చైతన్య తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఇలా వరుస ప్రాజెక్ట్ లతో ఏమాత్రం గ్యాప్ లేకుండా కెరియర్ ను ప్లాన్ చేస్తుంది. 


ఇక పూజ హెగ్డే కూడా వరుసగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం "వాల్మీకి" చిత్రంలో నటిస్తున్న పూజకి చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.  అయితే వీరిద్దరిలో టాప్ హీరోయిన్ కోసం పోటీ నెలకొన్నప్పటికీ, రష్మికకే ఎక్కువ ఛాన్స్ ఉంది. మరి ఆ స్థానం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: