టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మొదట డిస్ట్రిబ్యూటర్ గా తన పయనాన్ని మొదలెట్టిన దిల్ రాజు, ఆ తరువాత వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. అయితే తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన తొలి సినిమానే మంచి సక్సెస్ ని అందుకోవడంతో రాజు గారి బ్యానర్ కు ప్రేక్షకుల్లో అలానే సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు లభించింది. ఇక అక్కడి నుండి ఒక్కొక్కటిగా సినిమాలు నిర్మిస్తూ ప్రారంభమయిన దిల్ రాజు పయనం, ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా పేరు సంపాదించే రేంజ్ కి పెరిగింది. 

ఇక ప్రస్తుతం ఆయన బ్యానర్ లో ఎవరికైనా అవకాశం వచ్చిందంటే, నిజంగా అది అదృష్టం అనే అంటుంటారు సినీ విశ్లేషకులు. కెరీర్ పరంగా కొన్ని ఫ్లాప్స్ కూడా చవిచూసిన దిల్ రాజు, ఒక సినిమా ఎంతవరకు ప్రేక్షకుల్లోకి వెళ్తుందనే విషయాన్ని చాలావరకు జడ్జి చేయగలరు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, దిల్ రాజు గారి భార్య అనిత గారు ఇటీవలే కాలం చేసారు. వారికి ఒక  కుమార్తె,ఆమెకు కొన్నాళ్ల క్రితం పెళ్లి కూడా జరిగింది. ఇక రాజు గారికి సినిమాలో నిర్మాణంలో ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉండే శిరీష్, ఆయనకు తమ్ముడు అవుతారు. శిరీష్ కు ఒక కుమారుడు ఉన్నాడు, అతడి పేరు ఆశిష్. అయితే ఆశిష్ హీరోగా త్వరలో తమ బ్యానర్ లో ఎంతో ప్రెస్టీజియస్ గా ఒక సినిమా మొదలెట్టబోతున్నాం అని, 

నూతన దర్శకుడు సతీష్ దీనికి దర్శకత్వం వహిస్తాడని దిల్ రాజు ఇటీవల ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మధ్యలో సినిమా కథ మరియు మిగతా విషయాల వలన కాస్త లేట్ అయిన ఆ ప్రాజక్ట్, ఎట్టకేలకు వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుందట. రాజు గారికి కొడుకులు లేకపోవడంతో, అందరూ శిరీష్ కొడుకు ఆశిష్ నే రాజు గారి వారసుడుగా చెప్తున్నారు. సో మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుండి మరొక స్టార్ నిర్మాత వారసుడు హీరోగా మారి, అతి త్వరలో మన ముందుకు రాబోతున్నాడన్నమాట. మరి అతని సినిమా ఏ విధంగా ఉంటుందో, అతడు ఎంతవరకు సక్సెస్ సాధిస్తాడో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజలు ఓపిక పట్టాల్సిందే.... !!   


మరింత సమాచారం తెలుసుకోండి: