టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ టాప్ హీరోయిన్ గా కొనసాగిన ఈ మధ్యన కాస్తంత ఆమె స్పీడ్ తగ్గిందని చెప్పవచ్చూ.ఇక రిసెంట్‌గా విడుదలైన మన్మథుడు 2 ఫ్లాప్ కావడంతో రకుల్ కెరీర్‌కు తెలుగులో పెద్ద దెబ్బే పడింది.దాంతో ఆఫర్స్  వచ్చినా రాకపోయినా మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టాలని డిసెడై అడుగుపెట్టారు.ఇక ఇప్పుడు తనకున్న బిజినెస్ చూసుకుంటూ హాయిగా బతికేయవచ్చు అని అనుకుంటున్నారు.ఇంతకు ఆమె స్టార్ట్ చేసిన బిజినెస్ ఏంటంటే టెన్నిస్ ప్రీమియర్ లీగ్ లో ఓ జట్టుకి కో-ఓనర్ గా మారారు.ఈ విషయాన్ని స్వయంగా రకుల్ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది.కొద్దిసేపటి క్రితం రకుల్ ప్రీత్ ట్విట్టర్ లో ఆమె‘ఫైన్ క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్’ జట్టును కొనుగోలు చేస్తున్నట్లుగా ట్వీట్ చేయడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసిందట.



ఇక మొదటి నుంచి రకుల్ ప్రీత్ కమర్షియల్ బ్యూటీగా పేరు తెచ్చుకోవదమే గాక తనకొచ్చిన డబ్బులను పెట్టుబడులుగా పెట్టడంలో ముందువుంటుంది.ఇప్పటికే F 45 పేరుతో జిమ్ మొదలుపెట్టి బిజినెస్ ఉమెన్ అయిపోయి,జిమ్ బిజినెస్‌లో రకుల్ ప్రీత్‌కు పోటీ ఇచ్చే వాళ్లు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. సౌత్‌లోనే లేరు అని అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ..ఇక ఈ సంవత్సరం డిసెంబర్ లో జరగనున్న టెన్నిస్ ప్రీమియర్ లీగ్ ఈవెంట్లో రకుల్ జట్టు సభ్యులను తన ఎనర్జీతో ఎంకరేజ్ చేయనున్నారన్నమాట. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రస్తుతం హిందీతో పాటు,ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు.



ఏదిఏమైనా రకుల్ అటు సినీ రంగంలో రాణిస్తూనే మరలా ఇలా టెన్నిస్ జట్టు ప్రాంచైజీలా మారి తన ప్రత్యేకతను చాటుకోవటాన్ని అందరు తెగ పొగుడుతూ బిజినెస్‌లో కొందరి హీరోలకు ధీటుగా వున్నావంటూ ట్విట్లు పెడుతున్నారట..ఇక ఎన్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు..దేవ్‌..దే దే ప్యార్ దే..ఎన్‌.జి.కె..మ‌న్మ‌థుడు 2చిత్రాల్లో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా ఈ సంవత్సరం సంద‌డి చేసింది.కాని  వీట‌న్నింటీలో బాలీవుడ్ చిత్రం.దే దే ప్యార్ దే.మాత్ర‌మే ర‌కుల్‌కు చాలా మంచి పేరుని తెచ్చిపెట్టింది.మిగిల‌న‌వేవీ ఈమెకు పెద్ద‌గా క‌లిసి రాలేదు.ఇది కాకుండా మ‌రో రెండు త‌మిళ సినిమాలతో పాటు ఇండియ‌న్ 2 లో కూడా న‌టిస్తుంది.ఇక రకుల్ చేస్తున్న మూడు సినిమాలూ కూడా త‌మిళంలోనే కావ‌డం తెలుగులో ఒక్క సినిమాకూడా లేకపోవడం విశేషం..

మరింత సమాచారం తెలుసుకోండి: