రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరు.  వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఇప్పుడు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది. అయితే, మన్మధుడు 2 ముందు వరకు కెరీర్ బాగానే ఉన్నది.  నాగ్ తో చేసిన మన్మధుడు 2 ఫెయిల్ కావడంతో కెరీర్ డైలమాలో పడింది.  సినిమా ఫెయిల్ కావడంతో.. నెక్స్ట్ సినిమా ఏంటో తెలియని పరిస్థితుల్లో పడింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియా 2 సినిమాలో నటిస్తున్నది.  


దక్షిణాదిన పెద్దగా వర్కౌట్ కాకపోతుండటంతో ఈ అమ్మడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లాలని చూస్తున్నది.  బాలీవుడ్ లో ఇప్పటికే దే దే ప్యార్ దే సినిమా చేసింది.  ఈ సినిమా మంచి విజయమ్స్ ఆరాధించింది.  ఎంట్రీ సినిమా హిట్ కావడంతో.. నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టింది.  రెండో సినిమాతో మంచి విజయం సాధించాలని పాపం ట్రై చేస్తున్నది.  ఇలా సినిమాలు చేస్తూనే ఈ హీరోయిన్ బిజినెస్ రంగంలోకి దిగాలని చూస్తోంది.  


ఇప్పటికే హైదరాబాద్ లో ఎఫ్ 45 పేరుతో జిమ్ బిజినెస్ స్టార్ట్ చేసింది.  ఈ జిమ్ బిజినెస్ లో టాప్ స్పీడ్ తో దూసుకుపోతున్నది.  హైదరాబాద్ లో రెండు బ్రాంచ్ లు ఏర్పాటు చేసిన రకుల్, అటు వైజాగ్ లోను బ్రాంచ్ ను ఏర్పాటు చేసింది.  ఈ ఏర్పాటుతో దూసుకుపోయేందుకు సదా సిద్ధంగా ఉన్నది రకుల్.  దీంతో పాటు రకుల్ మరో బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టబోతున్నది.  


అదేమంటే... క్రీడా రంగం.  అవును.. రకుల్ ప్రీత్ క్రీడా రంగంలోకి అడుగుపెట్టబోతున్నది.  పెట్టబోతున్నది కాదు ఆల్రెడీ రకుల్ స్ట్రైకర్స్ క్లబ్ అనే టెన్నిస్ స్పోర్ట్స్ క్లబ్ ను కొనుగోలు చేసింది.  ప్రస్తుతం అండర్ 14, 18 ప్లేయర్స్ ఉన్నారు ఈ క్లబ్ లో.  భవిష్యత్తులో ప్రొఫెషన్స్ గా ప్లేయర్స్ తీర్చిదిద్దటమే కాకుండా.. ఐపీఎల్ లాగానే ఇండియాలో టెన్నిస్ ప్రీమియర్ లీగ్ లో క్లబ్ ను ఎంటర్ చేయాలని చూస్తున్నది.  ఐపీఎల్ లో ప్రీతీ జింటా, శిల్పా శెట్టిలు ఎలాగైతే విజయం సాధించారో అలాగే టెన్నిస్ లో రకుల్ విజయం సాధించాలని చూస్తున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: