సౌత్ ఇండస్ట్రీ లో సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా అందరి హీరోలతో కలసి నటిస్తూ స్టార్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ మారిపోయింది. అయితే ఇలా ఒకపక్క సినిమా రంగంలో రాణిస్తారు మరోపక్క కొత్తగా వ్యాపార రంగంలో కూడా అడుగు పెట్టింది. తన సినిమాలలో వస్తున్న డబ్బులను పెట్టుబడుల రూపంలో పెడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు కూడా చేయలేని ధైర్యాన్ని చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పటికే F 45 పేరుతో జిమ్ మొదలుపెట్టి బిజినెస్ ఉమెన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.


జిమ్ బిజినెస్‌లో రకుల్ ప్రీత్‌కు పోటీ ఇచ్చే వాళ్లు తెలుగు ఇండస్ట్రీలో కాదు.. సౌత్‌లోనే లేరు అనిపించుకుంది. ఇదే క్రమంలో వ్యాపార రంగంలో మరో కొత్త రంగంలో రకుల్ ప్రీత్ సింగ్ అడుగుపెట్టింది. అదేంటో కాదు టెన్నిస్ ప్రీమియర్ లీగ్ లో ఒక టీం కి కో-ఓనర్ గా ఉండటం. ఇదే విషయాన్ని ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా బయట పెట్టింది. రకుల్ ప్రీత్ ట్విట్టర్ లో ఆమె ‘ఫైన్ క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్’ జట్టును కొనుగోలు చేస్తున్నట్లుగా ఖరారు చేస్తూ  ట్వీట్ చేయడం జరిగింది.


దీంతో ఈ ఏడాది డిసెంబర్ లో జరగనున్న ఈ ఈవెంట్ లో రకుల్ తన జట్టు సభ్యులను తన ఎనర్జీతో ఎంకరేజ్ చేయనున్నారన్న అని అర్దమవుతోంది. ఇటీవలే కింగ్ నాగార్జున తో మన్మధుడు సీక్వెల్ మన్మధుడు 2 లో నటించి పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఈ సినిమా దెబ్బతో టాలీవుడ్ ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ గారికి పెద్ద దెబ్బే పడింది. అయితే సినిమా రంగంలో అవకాశాలు వచ్చినా రాకపోయినా కానీ మరోపక్క వ్యాపార రంగంలో మాత్రం ఎవ్వరు ఊహించని విధంగా దూసుకుపోతుంది. మొత్తంమీద చూసుకుంటే ఒకపక్క సినిమారంగంలో మరోపక్క వ్యాపార రంగంలో తన సత్తా చాటుతోంది రకుల్ ప్రీత్ సింగ్. 


మరింత సమాచారం తెలుసుకోండి: