ఒకానొక సమయంలో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నందమూరి బాలకృష్ణ సింహా సినిమా ద్వారా ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు మాస్ డైరెక్టర్ బోయపాటి శీను. ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న బాలయ్య బాబు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించారు. ఇదే తరుణంలో వీరిద్దరి కలయికలో లెజెండ్ సినిమా కూడా సింహా రేంజ్ లోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని భావించిన ఆ సమయంలో రాజకీయాల్లో బాలయ్య బాబు ఫుల్ బిజీగా ఉండటంతో అప్పట్లో ఆ ప్రయత్నాలు ఆగిపోయింది.


మరియు అదే విధంగా నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను తెరకెక్కించే క్రమంలో ఆ సినిమా కి బోయపాటి ఏ డైరెక్టర్ అని చాలామంది అప్పట్లో అనుకున్నారు. కానీ బాలయ్య బాబు డైరెక్టర్ క్రిష్ తో తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ని తెరకెక్కించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ ప్రస్తుతం మరో సినిమా రాబోతున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి.


ఈ చిత్రాన్ని జయ జానకి నాయక ఫేమ్ మిర్యాల రవీందర్ నిర్మించనున్నారు. బాలయ్య, బోయపాటితో మిర్యాల రవీందర్ ఉన్న ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. డిసెంబర్ నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా అయిన వెంటనే బోయపాటి తో తీయబోయే సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే చాలా కాలం తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందని వార్త బయటకి రావడంతో నందమూరి అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా కనుక హిట్ అయితే బాలయ్య బాబు బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కొట్టినట్లే అని అంటున్నారు ఇండస్ట్రీ కి చెందినవారు.



మరింత సమాచారం తెలుసుకోండి: