యువరత్న నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీనుల కలయికలో 2010లో వచ్చిన సింహ సినిమా, ఆ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో అతి పెద్ద విజయాన్ని అందుకుని అంతకముందు కొన్నాళ్ల నుండి సరైన సక్సెస్ లు లేని బాలకృష్ణకు సూపర్ మాస్ హిట్ ని అందించింది. అంతేకాదు అప్పుడెప్పుడో సమరసింహారెడ్డి, నరసింహనాయిడు వంటి ఇండస్ట్రీ హిట్స్ తరువాత ఒకరకంగా బాలకృష్ణకు సింహ సినిమా అప్పట్లో ఆ రేంజ్ ఇమేజిని తెచ్చిపెట్టడం జరిగింది. ఇక దాని తరువాత మరొక్కసారి బోయపాటితో సినిమా తప్పకుండా చేస్తాను అని బాలయ్య ప్రకటించారు.

కానీ వారి కలయికలో మళ్ళి సినిమా రావడానికి నాలుగేళ్లు పట్టింది. ఆ విధంగా నాలుగేళ్ళ తరువాత వచ్చిన లెజెండ్ సినిమా కూడా అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో పాటు బాలయ్యకు మరింత మాస్ ఇమేజి కట్టబెట్టింది. అయితే ఈ రెండు సినిమాల్లోనూ బాలకృష్ణ, డ్యుయల్ రోల్స్ చేయడం విశేషం. ఆ సినిమా అనంతరం వీరిద్దరి కలయికలో మూడవ సినిమా ఎప్పుడు వస్తుందా అని నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూడ సాగారు. అయితే వారి ఎదురు చూపులకు ఎట్టకేలకు ఐదేళ్ల తరువాత తెరపడి, నేడు వారిద్దరి కలయికలో సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం జరిగింది. 

జయ జానకి నాయక, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాల నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి సంస్థైన ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్న ఈ సినిమాను రాబోయే సమ్మర్ తరువాత రిలీజ్ చేయనున్నారు. ఇక కాసేపటి క్రితం వెలువడిన ఈ  అనౌన్సుమెంట్ తో బాలయ్య ఫ్యాన్స్ విపరీతంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్, మరియు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: