టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి పై రోజురోజుకు ప్రేక్షకులలో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అదరగొట్టడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక స్వాతంత్రోద్యమ కథగా పాన్ ఇండియా అపీల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను హిందీ, తమిళ్, మలయాళ భషాల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. 

ఇక మరొక మూడురోజుల్లో ప్రి రిలీజ్ ఈవెంట్ జరుపుకోనున్న ఈ సినిమాపై ఇప్పటికే కొంత పాజిటివ్ టాక్ వినపడుతుండగా, నేడు ఈ సినిమాపై కళాబంధు గా పేరుగాంచిన సుబ్బరామిరెడ్డి గారు ఫుల్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇక నేడు తన సన్నిహితులతో సైరా విషయమై మాట్లాడిన సుబ్బరామిరెడ్డి గారు, కొద్దిరోజుల క్రితం దిల్ రాజు, అల్లు అరవింద్ లను గీత ఆర్ట్స్ స్టూడియోలో కలవడం జరిగిందని, అయితే మాటల్లో సైరా సినిమా ప్రస్తావన రావడంతో వారిద్దరూ తనకు సైరా గురించి అక్కడక్కడా కొన్ని సీన్లు ఎలా తెరకెక్కించారో, కథ మరియు కథనాలు ఏ విధంగా ఉండనున్నాయో కొంత వివరించినట్లు చెప్పారట. అయితే వారు చెప్పిన దాని ప్రకారం, 

ఇప్పటివరకు మెగాస్టార్ కెరీర్ లో వచ్చిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే, ఈ సైరా సినిమా ఒక ఎత్తని తనకు అర్ధమయిందట. అదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద ప్రస్తావించిన సుబ్బరామి రెడ్డి గారు, ఈ సినిమాకు నిర్మాతగా రామ్ చరణ్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను ఎంతో గ్రాండియర్ గా నిర్మించినట్లు కూడా చెప్పారట. ఇక నేడు ఈ వార్త బయటకు రావడంతో సైరా పై మరింతగా పాజిటివిటి పెరిగింది. ఇక ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై పలువురు మెగాఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆనందంతో కామెంట్స్ చేస్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: